Home Blog Page 108

నోరు జారిన ప్రసన్నకుమార్ రెడ్డి.. వేమిరెడ్డి రియాక్షన్ ఏంటో?

Prasanna Kumar Reddy
Prasanna Kumar Reddy

Vemireddy Prasanthi Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళా నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పై వ్యక్తిగత కామెంట్స్ చేశారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్. దానిపై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. కానీ పార్టీ అధినేత అమర్నాథ్ ను సమర్థిస్తూ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. మరోసారి నెల్లూరు జిల్లాలో రచ్చకు దారి తీసే అవకాశం ఉంది.

ప్రశాంతి రెడ్డి గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి పై గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పకుండా గెలుస్తానన్నచోట ఓడిపోవడంతో ఆయనకు షాక్ తగిలింది. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే కాదు నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసిపి ఓడిపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. అందుకే వేమిరెడ్డి దంపతులు అంటేనే వైసీపీ నేతలకు పూనకం వచ్చేలా ఉంది. వారిని ఉద్దేశించి దారుణంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

నిత్యం రాజకీయ వేడి..
కోవూరు నియోజకవర్గ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిచిన తరువాత ఒక రకమైన రాజకీయ వేడి కనిపిస్తోంది. అక్కడ ఓడిపోయిన మనస్థాపనతో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వ్యక్తిగత కామెంట్లకు దిగుతున్నారు. గతంలో ఆమె వ్యక్తిగత జీవితం మాట్లాడేసరికి పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా వేమిరెడ్డి అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ధ్వంసం చేశారు. అయితే అప్పట్లో కవ్వింపు చర్యలు చేపట్టడం వల్లే ఆ ఘటన జరిగింది. అయితే ఇప్పుడు కూడా మరోసారి ప్రసన్నకుమార్ రెడ్డి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఆమెను ఉద్దేశించి సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ సంబోధిస్తూ విమర్శలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.

సోమిరెడ్డి అంటూ సంబోధన..
సోమిరెడ్డి కుటుంబంతో ప్రసన్నకుమార్ రెడ్డికి బంధుత్వం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడిని ప్రశాంతి రెడ్డి వివాహం చేసుకున్నారు. కానీ సోమిరెడ్డి సోదరుడు అకాల మృతి చెందారు. దీంతో ప్రశాంతి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం ఆడారు. అయితే తనపై గెలిచిన ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మరి దీనిపై వేమిరెడ్డి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ ప్రయోగాలు కాపులకు ఎరుక!

Jagan Kapu Vote Bank Strategy
Jagan Kapu Vote Bank Strategy

Jagan Kapu Vote Bank Strategy: రాజకీయాల్లో కొంతమంది పనితీరుతో రాణిస్తారు. మరికొందరు సెంటిమెంట్ రాజకీయాలు నడిపి రాణిస్తారు. రెండో కోణంలో రాణించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రజాభిమానాన్ని తాను పొందగలిగారు. తండ్రి మాదిరిగా సంక్షేమ పథకాలు అందించి ప్రజల మనసు గెలవాలని చూసారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర్ రెడ్డిని చూసుకోలేదు. మహానేత కుమారుడిగా ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి మాత్రం చాన్స్ ఇవ్వలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి చేయలేనంతగా.. కులాలను, వర్గాలను విడదీసి వారి అభిమానాన్ని పొందాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్కసారి మాత్రమే అందులో కూడా సక్సెస్ అయ్యారు. రెండోసారి విఫలమయ్యారు.

కాపుల మద్దతు అవసరం..
ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు మద్దతు ఉండాల్సిందే. అయితే ఆ కాపులను 2019 ఎన్నికల్లో టర్న్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా అటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి కాపులే కారణమని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అందుకే వారిలో చీలిక తేవాలని చూస్తున్నారు. కాపుల వేళ్ళతో కాపులను పొడిచే సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకు ను చీల్చడమే కూటమిని దెబ్బతీసే ఏకైక మార్గం అని బలంగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కాపులు ఆదరించని వైసీపీ కాపు నేతలు చాలామంది ఉన్నారు. వారిని ముందు పెట్టి ఇప్పుడు రాజకీయ క్రీడ మొదలుపెట్టారు.

వారిని ముందు పెడితే..
ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ.. ఇలాంటి వైసీపీ కాపు నేతలను ముందు పెట్టి కాపుల విషయంలో బలమైన ప్రచారానికి జగన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ రూపంలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్న కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రచారం మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని కోణంలో వ్యతిరేకతను నూరి పోయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కాపు యువతలో, ఓటర్లలో అసంతృప్తిని పెంచగలిగితే.. ఆ ఓట్లు ఆటోమేటిక్గా తమ వైపు టర్న్ అవుతాయన్నది జగన్ ఆలోచన.

తక్కువగా అంచనా
అయితే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ ఆలోచనను తక్కువగా అంచనా వేస్తున్నారన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య కాపుల విషయంలో జగన్ అనుసరించిన వైఖరి తెలియంది కాదు. ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ప్రయోజనాలను సైతం రద్దుచేసి కాపులను ఒక ఓటు అ lస్త్రంగా మార్చుకున్న వైనాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకున్నారు. పైగా ఇదే వైసిపి కాపు నేతలు కాపు సామాజిక వర్గం విషయంలో చేసిన ప్రకటనలు కూడా గుర్తున్నాయి కాపు సామాజిక వర్గానికి. తమ కళ్ళను తమ చేతితో పొడుచుకునేందుకు కాపులు సిద్ధంగా లేరు. తప్పకుండా జగన్ ప్రయత్నం వికటిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వడ్డే నవీన్ కెరియర్ ను తొక్కేసిందెవరు..? నందమూరి ఫ్యామిలీకి తనకి మధ్య గొడవలేంటి..?

Vadde Naveen Career Controversy
Vadde Naveen Career Controversy

Vadde Naveen Career Controversy: సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు చాలా సంవత్సరాల పాటు తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కొడుకులు, మనువలను సైతం హీరోలుగా సెటప్ చేసే ప్రాసెస్ లో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ రానిస్తాం అనుకున్న కొంతమంది హీరోలు కెరియర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు రావడంతో మనకంటే తోపు ఎవడు లేడు అనుకొని పెద్ద ఫ్యామిలీలో ఉన్న హీరోలను సైతం గెలకడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయడంతో వల్ల స్టార్ హీరోల అభిమానులు ఈ యంగ్ హీరోల సినిమాలను చూడడం మానేస్తున్నారు. దాని వల్ల వాళ్ళ సినిమాలు ఆడక వల్ల సినీ కెరియర్ అర్థంతరంగా ముగిసిపోతుంది… ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోలు అలా చేయడం వల్ల వాళ్ళ కెరియర్ ని కోల్పోయారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు వడ్డే నవీన్…

ఆయన సైతం చాలా సంవత్సరాల పాటు సినిమాలు లేకుండా ఖాళీ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న ఆయన ఎన్టీఆర్ కొడుకు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వాళ్ళు కలిసి మెలిసి ఉన్నారు.

కానీ ఏమైందో తెలియదు ఆ తర్వాత వాళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. దాంతో నవీన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయకుండా మానేశారు. ఇక ప్రస్తుతం తను సెకండ్ పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే సినిమాల పరంగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు…

నిజానికి వడ్డే నవీన్ విడాకులు తీసుకున్న తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ తన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకున్నానని గతంలో తెలియజేశాడు. మొత్తానికైతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

మోడీనే కాదు మన జర్నలిస్టులు ట్రంప్ ను వదల్లేదు.. ట్రంప్ ముఖం మీద చెప్పేశారు

Pranay Upadhyaya questions Trump
Pranay Upadhyaya questions Trump

Pranay Upadhyaya questions Trump: ట్రంప్ ముఖం మాడిపోయింది. ఆ ప్రశ్నకు అతని దగ్గర నుంచి సమాధానం లేకుండా పోయింది. ఏం చెప్పాలో కొంతసేపటి వరకు ఆయనకు అర్థం కాకుండా పోయింది. చివరికి తప్పదు అన్నట్టుగా గొంతు సవరించుకోవలసి వచ్చింది. అంతేకాదు భయపడుతూ.. ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ట్రంప్ ను ఇటీవల కాలంలో ఈ స్థాయిలో అమెరికా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చైనా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టలేదు. చివరికి అమెరికా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ స్థాయిలో ఒత్తిడికి గురి చేయలేదు. ఇదంతా చేసింది భారతదేశానికి చెందిన ఒక జర్నలిస్ట్.

అతని పేరు ప్రణయ్ ఉపాధ్యాయ్.. ఇండియా టుడే లో సీనియర్ జర్నలిస్ట్. G7 సమ్మిట్ లో భాగంగా ఆ ప్రోగ్రాం మొత్తాన్ని కవర్ చేయడానికి తన ఛానల్ తరఫున ఆయన వెళ్ళాడు .. ఈ క్రమంలో ట్రంప్, మోడీ కూర్చున్న చోట.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ను ఉద్దేశించి ప్రశ్నల పరంపర కురిపించారు. దానికి ట్రంప్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అంతేకాదు ఆ ప్రశ్నలకు ఆయన గొంతు సరి చేసుకోవాల్సి వచ్చింది.”మీరు ఇండియా గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఇటీవల మీరు తీసుకున్న నిర్ణయాలు ఇండియాకు ఇబ్బంది కలిగించాయి. ఆర్థికంగా నష్టం చేకూర్చాయి. ఇప్పుడేమో మీరు ఇండియా గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు.. దీనిని ఏ విధంగా చూడాలి అంటారు” అని ప్రణయ్ ప్రశ్నించాడు.

ఆ ప్రశ్న తట్టుకోలేక ట్రంప్ కొద్దిసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. అనంతరం లేని వినయాన్ని.. కృత్రిమ ప్రేమను ప్రదర్శించాడు..” శ్వేత సౌదం భారతీయులకు అనుకూలంగా ఉంటూనే ఉంది. నేను గతంలో.. ఇప్పుడు భారతదేశానికి అనుకూలంగానే వ్యవహరించాను. ఇప్పటి నిర్ణయాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం నాకు తెలియదు. నేను ఇండియాను ప్రేమిస్తాను. ఇండియాకు నాయకత్వం వహించే నాయకుడు ఇక్కడే ఉన్నారని” ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించినప్పుడు.. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.. దీనిపై మనదేశంలో రకరకాల చర్చలు జరిగాయి. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నరేంద్ర మోడీ వెళ్లిపోతున్నారని చాలామంది వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ట్రంప్ మన దేశ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో తడబడ్డారు.

ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Morning Tea Coffee Health Effects
Morning Tea Coffee Health Effects

Morning Tea Coffee Health Effects: ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తుంటారు. అయితే ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాటుగా కనిపించే ఈ చర్య దీర్ఘకాలంలో జీర్ణకోశ సమస్యలకు దారితీయొచ్చని చెబుతున్నారు. ఉదయమే టీ లేదా కాఫీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

కడుపులో యాసిడ్ స్థాయులు పెరిగే ప్రమాదం:
రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ఉదయం కడుపు ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో టీ లేదా కాఫీలో ఉండే కెఫిన్ కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో ఇవి మరింత తీవ్రంగా మారవచ్చు.

డీహైడ్రేషన్‌ను పెంచే కెఫిన్:
నిద్రపోయే సమయంలో శరీరం చాలా గంటల పాటు నీరు తీసుకోదు. దీంతో ఉదయం లేవగానే శరీరం స్వల్పంగా డీహైడ్రేట్ అయిన స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకుంటే మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని నీటి శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా అలసట, తలనొప్పి, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

హార్మోన్లపై ప్రభావం:
ఉదయం నిద్రలేవగానే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ సహజంగా అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మనల్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో కాఫీ లేదా టీ తీసుకుంటే కార్టిసోల్ స్థాయిల్లో మార్పులు ఏర్పడి శరీర సహజ జీవక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం:
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కొందరిలో వికారం, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా బలమైన కాఫీని ఉదయాన్నే తీసుకునే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

గోరువెచ్చని నీరు తాగాలా?
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను మేల్కొలిపి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది.వైద్యుల సూచనల ప్రకారం అల్పాహారం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం ఉత్తమం. ఆహారం తీసుకున్న తర్వాత కెఫిన్ ప్రభావం కొంత తగ్గి కడుపుపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

సాయికృష్ణ మిస్టరీ.. వైసీపీకి ఆస్త్రం.. సీఎం సీరియస్!

Saikrishna mystery
Saikrishna mystery

Saikrishna mystery: ఏపీలో ఒక ఆసక్తికర పరిణామం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. గాదే సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేయడం.. ఆయన అదృశ్యం కావడం పెద్ద మిస్టరీగా మారింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఈ పరిస్థితుల్లో సాయి కృష్ణ తల్లి మీడియా ముందుకు వచ్చి బోరున విలపించింది. తన కుమారుడిని పోలీసులు చంపేశారని.. కనీసం శవాన్ని అయినా ఇవ్వాలని ఆమె ప్రాధేయపడ్డారు. అయితే ఈ అంశంపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనుకూల మీడియా దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని అయితే ఏకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల క్రమంలో సింగపూర్ పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

విచారణకు అత్యున్నత కమిటీ..
సాయి కృష్ణ వివాదాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించింది. ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణకు ఒక కమిటీని నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే విఆర్ కు పంపగా.. ఆయనపై ఏకంగా సస్పెండ్ వేటు వేశారు సీఎం చంద్రబాబు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే తానే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని బిజెపిని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సాయి కృష్ణకు భారీ నేరచరిత ఉందని పోలీసులు చెబుతున్నారు. కానీ దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.

నేరచరిత్ర ఉందని..
సాయి కృష్ణ కృష్ణలంకకు చెందిన 25 ఏళ్ల యువకుడు. అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. గంజాయితోపాటు డ్రగ్స్ రవాణా కేసులు ఆయన పేరు ఉందని అంటున్నారు పోలీసులు. మహిళలను వేధించిన కేసులతోపాటు జైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ కేసుల విచారణకు సహకరించడం లేదని చెబుతూ సిఐ నాగరాజు సాయి కృష్ణను గత నెలలో మార్కాపురంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి సాయి కృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. అయితే ఏకంగా ఆమె తన కుమారుడిని పోలీసులు చంపేశారు అంటూ ఆరోపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. అసలు పోలీసులు అరెస్టు చేశారా లేదా అని ప్రశ్నించింది. అయితే పోలీసుల నుంచి భిన్నమైన వాదన వినిపించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 29 లోగా సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని కూడా ఆదేశించారు. ఈ తరుణంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకుంది.. సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు అని.. ఆయన శవాన్ని కూడా మాయం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుర్తించడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అందుకే విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది

వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి.. తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుంది..

Deep Sleep Tips
Deep Sleep Tips

Age wise Sleep duration: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రక్రియలు నిద్ర సమయంలో జరుగుతాయి. అందుకే వయసును బట్టి సరిపడా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు చూద్దాం..

Sleep Foundation మార్గదర్శకాల ప్రకారం.. వయసును బట్టి సరైన నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పెద్దల కంటే చిన్నపిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. 4 నుంచి 12 నెలల వయసున్న శిశువులు రోజుకు 12 నుంచి 16 గంటల వరకు నిద్రపోవాలి. ఈ దశలో వారి శారీరక, మానసిక ఎదుగుదల వేగంగా జరుగుతుండటంతో ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. 1 నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. అలాగే 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవడం మంచిది. ఈ వయసులో మెదడు అభివృద్ధి, నేర్చుకునే సామర్థ్యం, శారీరక ఎదుగుదలకు తగిన నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది.6 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 9 నుంచి 12 గంటల వరకు నిద్రపోవాలి. ఇక యుక్తవయసులో ఉన్న 13 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు 8 నుంచి 10 గంటల నిద్ర తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నిద్ర లేకపోతే చదువుపై దృష్టి తగ్గడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

18 ఏళ్లు దాటిన పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోవాలి. తగిన నిద్ర తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే రోజంతా చురుకుగా ఉండేందుకు నిద్ర ఎంతో అవసరం.

అయితే తక్కువ నిద్ర ఎంత ప్రమాదకరమో, అతిగా నిద్రపోవడం కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దలు రోజూ 9 గంటలకుపైగా నిద్రపోతుంటే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. థైరాయిడ్ సమస్యలు, డిప్రెషన్, స్లీప్ అప్నియా, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా అధిక నిద్ర రావచ్చు.

నిద్ర నాణ్యత కూడా నిద్ర వ్యవధి అంతే ముఖ్యమైనది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మొబైల్ ఫోన్లు, టీవీల వినియోగాన్ని తగ్గించడం, కాఫీన్ ఎక్కువగా తీసుకోకపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం వంటి అలవాట్లు మంచి నిద్రకు దోహదపడతాయి. సరిపడా నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది అని నిపుణులు సూచిస్తున్నారు.

'ఫౌజీ' మూవీ ఆ విషయంలో తేడా కొట్టాలనే కనిపిస్తుందిగా..

Fauji movie latest update
Fauji movie latest update

Fauji movie latest update: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. దర్శకుడు సైతం ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయి సంవత్సరన్నార అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ గాని, ఒక ఫోటో కానీ బయటికి రాలేదు. మరి ఎందుకని దర్శకుడు ఇంత గోప్యంగా ఈ సినిమా నుంచి త్రికరిస్తున్నాడు అనే ధోరణిలోనే మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు హను రాఘవపూడి చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. కారణం ఏంటంటే ఇప్పటివరకు ఆయన ఏ స్టార్ హీరోని కూడా డైరెక్ట్ చేయలేదు.

మొదటిసారి ప్రభాస్ ను డైరెక్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో మరో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. లవ్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించగలడనే ఒక పేరును సంపాదించుకున్న హను రాఘవపూడి ఫౌజీ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి వార్ ఎపిసోడ్ ను కూడా చాలా హై టెక్నికల్ వాల్యూస్ తో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం పనిచేస్తున్నారట. అయితే ఫౌజీ సినిమా ఆ విషయంలో మాత్రం చాలా వరకు తేడా కొట్టే విధంగానే కనిపిస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నప్పటికి ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ప్రభాస్ ఇప్పటివరకు సిస్టర్ సెంటిమెట్ తో సినిమాలైతే చేయలేదు.

ప్రభాస్ కి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. గతంలో హను రాఘవపూడి చేసిన ‘సీతారామం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అది కూడా ఆర్మీ బేస్డ్ సినిమాగానే రావడం ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ తో కూడా అలాంటి సినిమానే చేస్తున్నాడు. మరి ఈ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

5 నిమిషాల సరికొత్త ఫుటేజీ తో రేపటి నుండి థియేటర్స్ లో 'పెద్ది' కొత్త వెర్షన్..

Peddi OTT
Peddi OTT

Peddi new version movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ వేవ్ ని మనం ప్రతీ రోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ చల్లారిపోయే రోజులు ఇవి. అలాంటిది ‘పెద్ది’ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే వరుసగా 12 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందంటే , ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 21 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. నేడు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు కచ్చితంగా వచ్చేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని పాటలను మొత్తం రీసెంట్ గా యూట్యూబ్ లో విడుదల చేసేశారు .

దీనిపై అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. ‘పెద్ది’ చిత్రానికి వీడియో సాంగ్స్ చాలా పెద్ద పాజిటివ్. అలాంటి వీడియో సాంగ్స్ మొత్తాన్ని యూట్యూబ్ లో పెట్టేసారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిపీట్ లో చూడాలని అనుకున్న ఆడియన్స్ పరిస్థితి ఏంటి?, ఇంత తెలివి తక్కువ పని మేకర్స్ ఎలా చేశారు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అయితే రేపటి నుండి సరికొత్త సన్నివేశాలను జత చేయబోతున్నారు అట మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 5 నిమిషాల 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ కొత్త సన్నివేశాల కారణంగా కలెక్షన్స్ రేపటి నుండి ఇంకా బాగా పెరుగుతాయని, వీకెండ్ కి రామ్ చరణ్ దుమ్ము లేపేస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి. జగపతి బాబు , రామ్ చరణ్ కి మధ్య ఉన్న కొన్ని సన్నివేశాలను జత చేస్తున్నారట.

అదే విధంగా శివరాజ్ కుమార్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని , హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ మధ్య వచ్చే కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి , వాటి స్థానం లో రెండు మంచి సన్నివేశాలు జత చేశారట. నేడు ఈ కొత్త సన్నివేశాలకు రామ్ చరణ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. గతం లో కొత్త సన్నివేశాలు జత చేయడం వల్ల , శంకర్ దాదా MBBS , మగధీర, మిర్చి , పుష్ప 2 వంటి సినిమాలకు లాంగ్ రన్ లో కలెక్షన్స్ అదనంగా కలిసొచ్చాయి, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రానికి కూడా అదే విధంగా వర్కౌట్ అవ్వుద్దని భావిస్తున్నారు.

జగన్ కు లోకేష్ సవాల్.. వచ్చింది మాత్రం లక్ష్మీపార్వతి, శ్యామల!

Nara Lokesh Mangalagiri
Nara Lokesh Mangalagiri

Nara Lokesh Challenge: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. డీఎస్సీపై ఎలాగైనా బురద జల్లాలన్న ప్రయత్నంలో ఉంది ఆ పార్టీ. అందుకుగాను ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఆధారాలతో సహా వివరణ ఇస్తుంటే.. అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అసలు ఉద్దేశం బయటపడుతోంది. నిన్ననే డీఎస్సీ పై సవాల్ చేశారు మంత్రి నారా లోకేష్. నీకు 200 మీటర్ల దూరంలో ఉన్నాను. చర్చకు రా డీఎస్సీ పైన అంటూ సవాల్ చేశారు. అయితే ఇక్కడ సరికొత్త ఆలోచన చేశారు జగన్. తన బదులు నందమూరి లక్ష్మీపార్వతి, యాంకర్ శ్యామలను పంపించారు. వారు వచ్చి నారా లోకేష్ కు సవాల్ చేశారు. అసలు నారా లోకేష్ చేసింది ఏంటి? లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామలకు తెలిసింది ఏంటి? అనేది తెలియదు కానీ.. ఈ అంశంపై రచ్చ మాత్రం కొనసాగేలా చేశారు జగన్. చివరకు డీఎస్సీ లో అక్రమాలు జరగలేదని స్వయంగా ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణాత్మక ప్రయత్నాలు చేశారు. సాక్షిలో వచ్చిన కథనాలను, కేస్ స్టడీ లపై కూడా నివృత్తి చేశారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంతృప్తి కనిపించలేదు. మహిళా నేతలను సైతం ఈ రచ్చ లోకి దింపారు అంటే వారు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతోంది.

* జగన్ అదే పనిగా విమర్శలు..
కొంతమంది డీఎస్సీ అభ్యర్థులను పక్కలో పెట్టుకొని ప్రభుత్వం పై విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. వారికి ర్యాంకులు వచ్చాయి కానీ ఉద్యోగాలు దక్కలేదని ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాలు అడుగడుగునా అవినీతి జరిగింది అనేది జగన్ ఆరోపణ. ఆయనే కాదు కింది స్థాయి నేతల వరకు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. అదేపనిగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోనీ ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు కదా.. అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయవచ్చు కదా.. అంటే మాత్రం అటువంటి ప్రయత్నం లేదు. పారదర్శకంగా చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్న పెడచెవిన పెడుతూనే ఉన్నారు. చివరకు కమ్మ డీఎస్సీ అంటూ.. స్పోర్ట్స్ కోటా కింద ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా ఉద్యోగాలు కేటాయించారు అంటూ హడావిడి చేశారు. అయితే ఓపెన్ క్యాటగిరి కింద కాపులకు 16, రెడ్డి సామాజిక వర్గానికి 10, కమ్మ సామాజిక వర్గానికి 9 పోస్టులు కేటాయించామని చెప్పడంతో తోక ముడిచారు.

* రచ్చ కే ప్రాధాన్యం..
డీఎస్సీ అక్రమాలపై ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు నారా లోకేష్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామలను హడావిడిగా హైదరాబాదు నుంచి రప్పించి.. లోకేష్ కు సవాల్ విసిరేందుకు అమరావతికి తీసుకెళ్లారు. వారి వెంట ఓ ముగ్గురు నలుగురు మహిళలు ఉన్నారు. వారి సవాల్ చేసేసరికి డీఎస్సీ అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వెనుక ఉన్న అంతరార్థం బయటపడింది. ఒకవైపు హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం నడిచింది. బాగా మాట్లాడావ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ ఫోన్ చేసి అభినందించినట్టు టాక్ నడిచింది. దానికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే గుడివాడ అమర్నాథ్ మంత్రి వంగలపూడి అనిత పై చేసిన కామెంట్స్ మంచివే అన్నట్టు ఇప్పుడు లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామల బదులిచ్చారు. మొత్తానికి అయితే డీఎస్సీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదిలే అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నమాట.

రుతుపవనాలు బలహీనం.. 23 తర్వాత ఏపీలో భారీ వర్షాలు!

Monsoon Update AP
Monsoon Update AP

Monsoon Update AP: ఆంధ్రప్రదేశ్లో వాతావరణంలో మార్పులు కనిపించాయి. చల్లటి వాతావరణం ప్రారంభమైంది. ద్రోణి ప్రభావం ఏపీ పై ఉంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కోస్తాంధ్రతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సైతం వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.

*బలహీనంగా రుతుపవనాలు..
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కానీ బలహీనంగా ఉన్నాయి. ఈనెల 23 తర్వాత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పటివరకు మాత్రం తేలికపాటి వర్షాలకి అవకాశం ఉంది. బుధవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లా వేపాడలో 9.67 సెంటీమీటర్లు, శ్రీ సత్య సాయి జిల్లా బుక్క సముద్రంలో 6.9, నర్సీపట్నంలో 6.65, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో 6.58, ప్రకాశం జిల్లా టంగుటూరులో 6.44 వర్షపాతం నమోదయింది. అనకాపల్లి జిల్లాలో 5.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సైతం వానలు పడ్డాయి.

* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మరోవైపు రాయలసీమలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా ఒంగోలులో 42, అమరావతిలో 41.5, నెల్లూరులో 40.9, గన్నవరంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వర్షం పడుతున్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. అందుకే ప్రజలు చెట్లు, స్తంభాలు, హోర్టింగుల వద్ద నిల్చో వద్దు అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది

ట్రంప్ శాంతి కాముకుడు.. నరేంద్ర మోడీకి ఏమైంది..

Narendra Modi Trump Meeting
Narendra Modi Trump Meeting

Narendra Modi Trump Meeting: “గద్దలను వేటాడేవాడు.. ఒక్కసారిగా రూపం మార్చుకుంటే శాంతి కాముకుడు అయిపోడు. జస్ట్ తన అవసరాలకు తగ్గట్టుగానే తన అవతారాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఆ మాత్రం దానికి అతడు గొప్పవాడని.. శాంతిని పరివ్యాప్తం చేసే వాడని అనుకోవద్దు. అలా అనుకుంటే మనకు మూర్ఖత్వం ఉందని చుట్టుపక్కల జనం భావిస్తుంటారు.” వెనుకటికి ఒక ఆఫ్రికన్ జానపదాన్ని తెలుగీకరిస్తే వచ్చిన అర్థం ఇది.

ప్రస్తుతం జి 7 సమ్మిట్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే పై ఉపోద్ఘాతం నిజమే అనిపిస్తోంది. తనకు అవసరం లేని యుద్ధంలో అమెరికా వేలు పెట్టింది.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పట్లో ఆ దేశం కోలుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. వేలాదిమంది చనిపోయారు. ఇరాన్ దేశం సుప్రీం నాయకత్వాన్ని కోల్పోయింది.. విలువైన వనరులను నష్టపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ దేశం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అమెరికాతో మొండిగా యుద్ధం చేసింది కాబట్టి సరిపోయింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

ఇంత ఉత్పాతాన్ని.. ప్రపంచం మీద ఆర్థిక భారాన్ని.. అమెరికా ప్రజలకు నరకాన్ని చూపించిన ట్రంప్.. శాంతి ప్రవచన కారుడు అయిపోయారు. చివరికి మన దేశ నావికులను చంపిన అమెరికా అధిపతి ఇప్పుడు గ్లోబల్ పీస్ లీడర్ గా మారిపోయారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. G7 సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి ప్రశంసించారు. హర్ముజు జల సంధి తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇండియన్ నావికుల భద్రత తనకు ముఖ్యమని.. వారి రక్షణకు కంకణ బద్దులుగా ఉండాలని కోరారు. దీనిపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. అంతేకాదు త్వరలో ఇండియాలో పర్యటిస్తానని మోడీకి మాట ఇచ్చారు. ట్రేడ్ డీల్ కూడా పూర్తి కావస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు ఆయనను ఏమాత్రం లెక్కపెట్టలేదు. పైగా అమెరికా సిబ్బందికి చుక్కలు చూపించారు. ట్రంప్ ను చైనా అధ్యక్షుడు ఆకాశానికి ఎత్తేయలేదు. కనీసం మనిషి మాదిరిగా కూడా చూడలేదు. కానీ నరేంద్ర మోడీ ఎందుకు ట్రంప్ ను పొగిడారు.. మన దేశానికి సంబంధించిన ముగ్గురు నావికులను చంపినప్పటికీ కూడా అలా ఎందుకు చేశారనేది ఇప్పటికి అర్థం కావడం లేదు.

ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు.. కాబోయే భార్య తో కలిసి ట్రిప్ కి వెళ్తున్న అమీర్ ఖాన్.. వీడియో వైరల్..

Aamir Khan
Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో అమీర్ ఖాన్ పేరు కచ్చితంగా ఉంటుంది. కరోనా లాక్ డౌన్ కి ముందు బాలీవుడ్ ని రెండు దశాబ్దాల పాటు తిరుగులేని సూపర్ స్టార్ గా ఒక ఊపు ఊపాడు. ఆయన సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ ని కేవలం ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. మిగిలిన ఇద్దరు ఖాన్స్ పీక్ రేంజ్ ఫార్మ్ లో ఉన్నప్పటికీ కూడా, అమీర్ ఖాన్ కలెక్షన్స్ కి దరిదాపుల్లో ఉండేవారు కాదు. గజినీ నుండి అమీర్ ఖాన్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ ‘దంగల్’ వరకు సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించాడు అమీర్ ఖాన్. ఇకపోతే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఎందుకంటే ఆయనకు రెండు సార్లు విడాకులు జరిగింది కాబట్టి. విడాకులు జరిగినప్పటికీ కూడా తన మాజీ భార్యలతో అమీర్ ఖాన్ చాలా గొప్ప ఫ్రెండ్ షిప్ రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నాడు. అందుకు ఉదాహరణ గా నిల్చింది రీసెంట్ గా జరిగిన ‘లగాన్ ‘ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి హాజరయ్యాడు. అనంతరం ఈవెంట్ ముగిసిన తర్వాత , ఆయన ఇద్దరు భార్యలతో కలిసి ఒకే కారులో వెళ్ళాడు. గమ్మత్తు ఏమిటంటే అమీర్ ఖాన్ కాబోయే భార్య కూడా అదే కారులో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది. అమీర్ ఖాన్ మొదటి భార్య పేరు రీనా దత్త. ఈమెతో కొన్నాళ్ళకు విడాకులు జరిగిన తర్వాత , లగాన్ మూవీ షూటింగ్ సమయం లో కిరణ్ రావు తో ప్రేమలో పడ్డాడు అమీర్ ఖాన్.

రెండు దశాబ్దాల పాటు ఆమెతో కలిసి మంచి దాంపత్య జీవితాన్ని గడిపాడు. కానీ కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు కానీ , వీళ్లిద్దరు ఇప్పటికీ స్నేహం గానే ఉన్నారు , ఇద్దరు కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు కూడా. ఇకపోతే అమీర్ ఖాన్ ప్రస్తుతం గౌరీ అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. త్వరలోనే ఈమెని పెళ్లాడబోతున్నాడని టాక్. ఇవన్నీ పక్కన పెడితే ఇదే కారులో అమీర్ ఖాన్ చిన్న కుమారుడు ఆజాద్ కూడా ఉండడం విశేషం. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

వైసిపి 'కాపు' అస్త్రాలు.. కూటమి విరుగుడు!

YCP Kapu politic
YCP Kapu politic

YSRCP Kapu politics : కాపు అనే మాట వింటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పూనకం వస్తోంది. కాపు అంశాలను విడిచి పెట్టవద్దు అని అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు గట్టిగానే పిలుపునిచ్చారు. అందుకే కాపు అంశాలను చర్చించేందుకు తోట త్రిమూర్తుల నేతృత్వంలో కాపు నేతల విందు రాజకీయం ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కాపుల అంశాలపై రకరకాల ప్రయోగాలు జరగనున్నాయి ఏపీలో. ముద్రగడ పద్మనాభం ప్రయోగాలకు కాలం చెల్లి పోవడంతో ఇప్పుడు తోట త్రిమూర్తులను ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఓ సాధారణ కేసులో సాయి కృష్ణ అనే యువకుడు అరెస్టు కావడం.. తరువాత ఆయన అదృశ్యం కావడం.. వైయస్సార్ కాంగ్రెస్ దృష్టిలో పడింది. దానిని రాష్ట్రం గా మార్చి.. కాపులపై జరుగుతున్న దాడి అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఒక్క సాయి కృష్ణ వ్యవహారం మాత్రమే కాదు.. మున్ముందు చాలా రకాల కాపు పరిణామాలు జరగనున్నాయని అర్థం అవుతోంది.

* అప్పట్లో ముద్రగడ ద్వారా..
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అక్కడ కు రెండేళ్లకే కాపు రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం అయింది. ముద్రగడ పద్మనాభం ప్రశ్నించడం ప్రారంభించారు. అలా ఆ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. గిన్నెల చప్పుడు, కంచాల చప్పుడుతో ముద్రగడ ఓ రేంజ్ లో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకెళ్లారు. తుని రైలు విధ్వంసం కేసుతో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడేందుకు కారణమయ్యారు. అలా దూరమైన కాపులు టిడిపికి భారీ షాక్ ఇచ్చారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ పవన్ నేతృత్వంలోని కూటమికి దగ్గరయ్యారు. అయితే గతం మాదిరిగా కాపులపై ముద్రగడ పద్మనాభం ప్రయోగిస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తోట త్రిమూర్తులను రంగంలోకి దించుతున్నారు.

* గట్టి ఆలోచనతో జగన్..
ఇంకా ఎన్నికలకు మూడేళ్లు వ్యవధి ఉంది. ఇప్పటినుంచి కాపు అంశాన్ని తీసుకోకపోతే ఆ వర్గంలో చీలిక రాదు అని జగన్ భావిస్తున్నారు. అందుకే సాయి కృష్ణ లాకప్ డెత్ అని.. సాయి కృష్ణను చంపేశారు అంటూ లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. సాయి కృష్ణ పై 23 ఏళ్లకే అనేక రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల దర్యాప్తులో భాగంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి సాయి కృష్ణ కనిపించడం లేదు. అయితే రాష్ట్రంలో ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. కానీ సాయి కృష్ణలో కనిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు యువకుడు కావడం. అది మొదలు టార్గెట్ చేయడం ప్రారంభించింది ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వాన్ని కాపులు నమ్మారు. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం కాపులను నట్టేట ముంచుతోంది అంటూ ఆరోపించడం మొదలుపెట్టారు.

* పవన్ సీరియస్..
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు ప్రయత్నాలను గట్టిగానే అడ్డుకోవాలని భావించారు. సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబును నేరుగా కలుసుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు ఇద్దరు నేతలు. సామాజిక వర్గాల మధ్య చీలికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్ముందు వైసీపీ కాపు కుట్రలు మరిన్ని జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేయాలని సూచించారు. అయితే గతం మాదిరిగా వైసిపి కాపు అస్త్రాలు ఇప్పుడు పని చేసే ఛాన్స్ లేదు అన్నది విశ్లేషకులు మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ కు ఊరట!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో వ్యతిరేక ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల్లో.. చెరువుకు చెందిన భూములు ఉన్నాయని.. పవన్ ఆక్రమించారని కొందరు ఆరోపించడం ప్రారంభించారు. తెలంగాణలో జనసేన సభ ఏర్పాటు నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడిచింది దీనిపై. దీనిపై న్యాయస్థానం స్పందించింది. తక్షణం ఆ వార్తలతో పాటు వీడియోలను తొలగించాలని సదరు మీడియా సంస్థలను ఆదేశించింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉపశమనం లభించినట్లు అయింది.

* తెలంగాణ వివాదంతో..
మొన్న మధ్యన తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన సభ ఏర్పాటుకు సిద్ధపడగా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఇంకా ప్రాంతీయ వాదంతో ముందుకు వెళుతున్న వారిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. ఆయన భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో కోడి చెరువును ఆక్రమించేసారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను చెరువు భూమిని కబ్జా చేసినట్టు నిరూపిస్తే జన్వాడలోని తన ఇంటిని తానే స్వయంగా తగలబెట్టుకుంటానని తేల్చి చెప్పారు.

* కోర్టు ఆదేశాలు..
ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల విషయంలో తెలంగాణ జనసేన నేతలు పూర్తి ఆధారాలను బయటపెట్టారు. అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు అనుమతులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది రాజకీయ కక్షతో, పవన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశం లో పవన్ కళ్యాణ్ పై నిరాధారమైన సమాచారంతో కూడిన పోస్టులను, వీడియోలను, కంటెంట్ ను తొలగించాలని ఎక్స్ మెటా, గూగుల్ ఇండియా, యూట్యూబ్, గూగుల్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యుఆర్ఎల్ లను బ్లాక్ చేయాలని సూచించింది.

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో.. నిజంగా హ్యాట్సాఫ్!

District Collector Son Government School
District Collector Son Government School

District Collector Son Government School: సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు సైతం ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అటువంటిది ఓ జిల్లా కలెక్టర్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. అయితే ఇదేదో కొత్తగా కాదు. ప్రాథమిక స్థాయి నుంచి అతని కుమారుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. సాధారణంగా కలెక్టర్లకు బదిలీ అవుతూ ఉంటుంది. అయితే తాను ఎక్కడికి బదిలీ పై వెళ్ళినా.. అక్కడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల అభిప్రాయం మారుతోంది. పెద్ద ఎత్తున ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇది మంచి మార్పు కూడా.

* పార్వతీపురం పాఠశాలలో..
పార్వతీపురం జిల్లా కలెక్టర్గా ఎన్ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన నియమితులయ్యారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. ప్రభాకర్ రెడ్డికి పార్వతీపురం బదిలీ కావడంతో ఈ ఏడాది పదో తరగతి డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతిలో చేర్పించారు. నిజంగా ఇది గొప్ప విషయం. కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అక్కడ ప్రధానోపాధ్యాయుడు తో పాటు ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాద్ కూడా తన కుమారుడిని ఇదే డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ పాఠశాలలో చదివించారు.

* బదిలీ జరిగినా..
సాధారణంగా కలెక్టర్లు ఒకే చోట ఉండరు. బదిలీలు అనేది వారికి సర్వసాధారణం. ప్రభాకర్ రెడ్డి శాప్ ఎండి గా పని చేశారు. అప్పట్లో తన ఇద్దరు పిల్లలను విజయవాడ పడమట జడ్పి ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. సాధారణ తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆలోచిస్తున్న ఈ రోజుల్లో.. ఒక జిల్లా కలెక్టర్ తన కుమారుడిని సర్కారు బడిలో చదివించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. కాగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభాకర్ రెడ్డి ముందుగా ప్రవేశపెట్టారు. కలెక్టర్ల సదస్సులు ఇదే విషయాన్ని చెప్పి సీఎం చంద్రబాబు సైతం అభినందనలు తెలిపారు.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు వద్దన్నా డబ్బు.

Today 18 June 2026 Horoscope
Today 18 June 2026 Horoscope

Today 18 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బులు ఆహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పనులు చేపట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం చాలా అవసరం. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారు పెద్దలను సంప్రదిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుడుమ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలి. గ్రహాలు అనుకూలతలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు ఉద్యోగులు ఈరోజు పని ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు ఉండడంతో బిజీగా మారిపోతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సలహా అవసరం. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన ఆర్థిక వనరులు అందుతాయి. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అవసరమైన సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆర్థిక వనరులు సమకూరుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.