Home Blog Page 100

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'నాగబంధం' ట్రైలర్.. 100 కోట్ల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఎలా సాధ్యం..

Naga Bandham Pre Release Business
Naga Bandham Pre Release Business

Nagabandham Trailer: క్వాలిటీ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నా రోజులివి. హీరో ఎవరైనా కానీ , ప్రేక్షకులకు కావాల్సిన సరైన కంటెంట్ అందిస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానమైన కలెక్షన్స్ ని ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఇటీవల కాలం లో ఇలాంటి సందర్భాలు హాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చూస్తూ వచ్చాము. మన టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ రీసెంట్ గానే మొదలైంది. అందుకే కొత్త హీరోల మీద కూడా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసం చేస్తున్నారు. అలా తీసిన చిత్రమే ‘నాగ బంధం’. ఈ చిత్రం ద్వారా విరాట్ కర్ణ అనే కొత్త కుర్రాడు హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఈ చిత్రం లో నభ నటేష్ నటించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే , 100 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఉన్న మూవీ ని ఎలా తెరకెక్కించారు?, నిజంగా డైరెక్టర్ అభిషేక్ నామా కి దండం పెట్టాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ మిస్టరీ గా ఉన్న నిధి ని ఛేదించడానికి అసురులు ప్రయత్నం చేస్తుంటారు. నిధి కంటే విలువైన బ్రహ్మ కమలం దొరికితే ఈ విశ్వాన్నే శాసించవచ్చు , అది కూడా అనంత పద్మనాభ ఆలయాళం లోనే ఉంటుంది. దాని కోసం అసురులు ప్రయత్నం చేయడం , హీరో దానిని అడ్డుకోవడమే ఈ సినిమా స్టోరీ.

ఇలాంటి ఫాంటసీ జానర్ సినిమాలకు ఇది రొటీన్ స్టోరీ నే , అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని చోట్ల VFX షాట్స్ తేడా కొట్టాయి, ముఖ్యంగా ట్రైలర్ లోని చివరి షాట్ లో , భారీ విష సర్పాలను చూపిస్తారు, అది చూసేందుకు సహజం గా లేదు. ట్రైలర్ మొత్తం మీద ఇదొక్కటే తేడా గా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో కూడా గొప్పగా అనిపించడం లేదు. చూసేందుకు బాగానే ఉన్నాడు కానీ , ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి విడుదలయ్యాక ఈ ఫీలింగ్ ఉంటుందో లేదో చూడాలి.

 

 

'వెల్కమ్ టు జడల్ జమానా'.. పూనకాలు రప్పిస్తున్న 'ది ప్యారడైజ్' లేటెస్ట్ టీజర్..

The Paradise Latest Teaser
The Paradise Latest Teaser

The Paradise Latest Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ గతం లో ఎప్పుడైనా చూశామా ?, నాని రైజ్ కి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి ఉంటుంది చెప్పండి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్ అయ్యింది. ముందుగా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ఆయా షేర్’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మేనియా నే కనిపిస్తోంది. జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు.

ఇకపోతే నేడు కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన విలన్ టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం రాఘవ్ జుయల్ అనే బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ పేరు విక్రమ్ మాలిక్. ‘ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా?, ఖాన్ దాన్ కా డాన్, స్నేహితులకు జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం , సుస్వాగతం’ అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో రాఘవ్ జుయల్ ని పరిచయం చేయించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మెడ మొత్తం నగలతో , స్టైల్ గా నడుచుకుంటూ రాగా, ఆ షాట్ కి అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. ఇక చివర్లో నేచురల్ స్టార్ నాని ‘వెల్కమ్ టు జడల్ జమానా’ అంటూ చెప్పే డైలాగ్ కూడా బాగా పేలింది. ఓవరాల్ గా హాలీవుడ్ తరహా మేకింగ్ స్టైల్ ని చూపించాడు డైరెక్టర్.

ఈ టీజర్ లో ప్రతీ షాట్ లోనూ క్వాలిటీ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. దీనిని బట్టీ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని , క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా , ఏ రేంజ్ లో తీస్తున్నాడా అర్థం అవుతోంది. అందుకే సినిమా విడుదలకు బాగా ఆలస్యం అవుతోంది. ఇక ఈరోజు విడుదల చేసిన ఈ టీజర్ ద్వారా అర్థమైన మరో విషయం ఏమిటంటే , ఈ చిత్రం ఆగస్టు 21 న కూడా విడుదల అవ్వడం లేదని. టీజర్ లో ఎక్కడ కూడా సినిమా విడుదల తేదీని ప్రస్తావించలేదు. నాని కూడా త్వరలో అన్నట్టుగానే చెప్పాడు కానీ , విడుదల తేదీ ప్రస్తావ తీసుకొని రాలేదు. కాబట్టి ఈ చిత్రం వాయిదా పడినట్టే అనుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

మహేష్ బాబు హీరోగా పనికిరాడని చెప్పిన దర్శకుడు ఎవరంటే..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu Hero Debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ముఖ్యంగా మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడు కృష్ణ చాలామంది దర్శకులను సంప్రదించారట. అందులో కొంతమంది దర్శకులు మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. మరికొందరైతే మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి పనికిరాడేమో అనేట్టుగా మాట్లాడారట. మొత్తానికైతే రాఘవేందర్రావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇంతకీ మహేష్ బాబును హీరోగా పనికిరాడు అని చెప్పిన డైరెక్టర్ ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి తమిళ్ సినిమా దర్శకుడు అయిన పి వాసు మహేష్ బాబును చూసి తను హీరోగా పెద్దగా పనికి వచ్చేలా కనిపించడం లేదు అని అన్నారట.

కానీ కసరత్తులు చేస్తే మాత్రం స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తను చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్న మహేష్ బాబు చాలా వరకు కసరత్తులు చేసి యాక్టింగ్ లో మెలుకువలను కూడా నేర్చుకొని స్టార్ హీరోగా మారాడు…

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఉండటం అనేది నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. నిజానికి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటిస్తాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తనలా నటించేవారు ఇండస్ట్రీలో మరెవరు లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోతాడు…ఇక ఈ మూవీ తర్వాత ఆయన డైరెక్ట్ గా హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమా చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…

కృష్ణలంక సీఐ నాగరాజు ఏం చేశారు.. గాదె సాయి కృష్ణ కేసులో అసలు నిజం ఇది..

Krishnalanka CI Nagaraju Case
Krishnalanka CI Nagaraju Case

Krishnalanka CI Nagaraju Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ గురించి మీడియాలో ప్రభుత్వంగా వార్తలు వస్తున్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి.. అదృశ్యం కావడంతో నాగరాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాయి కృష్ణ మీద రౌడీషీట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇతడి మీద అనేక రకాలుగా కేసులు ఉన్నాయి.

సాయి కృష్ణ అదృశ్య ఘటనను వైసిపి తనకు అనుకూలంగా మార్చుకుంది. ఏకంగా వైసీపీ అధినేతల జగన్ సాయి తల్లిని పరామర్శించారు. ఇక్కడ కులం గురించి మాట్లాడారు. అంతేకాదు, కొద్దిరోజుల ముందు వైసీపీ నేత అంబటి రాంబాబు పిల్ల సాయి వ్యవహారంలో సరికొత్త బాంబు పేల్చారు. ఆయనను పోలీసులు హత మార్చారని ఒక ఫోటోను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఏపీలో కలకలం నెలకొంది.

ఈ సంఘటనలు ఇలా జరుగుతుండగానే.. పేరిపోగు క్రాంతి కుమార్ అనే యువకుడు తీసుకున్న వీడియో సంచలనం గా మారింది. ఇతడు క్రైమ్ సస్పెక్ట్ షీటర్. సాయి కృష్ణ సిఐ నాగరాజు చిత్రహింసలు పెడుతున్న తీరు తాను చూశాను అంటూ మహంకాళి చందు అని క్రైమ్ సస్పెక్ట్ షీటర్ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. సిఐ నన్ను కొడుతున్నారని క్రాంతికుమార్ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. క్రాంతి కుమార్ మే నెలలో 21న బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పేరి పోగు వెంకటేశ్వరరావు కుమారుడు.

ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే క్రైమ్ సస్పెక్ట్ సీటు ఉన్న వారి ఇండ్లకు వెళ్లి పరిశీలన జరుపుతున్నారు. అంతేకాదు పోలీసులు పదేపదే ఇంటికి రావడం.. భార్యతో వివాదాలు సాగుతున్న నేపథ్యంలో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో వెంకటేశ్వరరావు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తాజాగా క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో బయటికి రావడంతో కలకలం నెలకొంది. క్రాంతికుమార్ గతంలో చైన్ స్నాచింగ్.. బైండోవర్ కేసుల్లో శిక్షలు ఎదుర్కొన్నాడు.

ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ సురేష్.. క్రాంతికుమార్ సరిగ్గా రెండు నెలల క్రితం విజయవాడలో ఉన్న ఒక బార్ కు వెళ్లారు. అక్కడ విపరీతంగా తాగారు. అంతేకాదు మధ్యమధ్యలో అక్కడ సిబ్బంది మీద దారుణంగా దాడి చేశారు. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో సురేష్ మీద పోలీసులు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు.

మరోవైపు సాయి కృష్ణను పోలీసులు చిత్రహింసలు పెడుతున్న తీరును తాను చూశానని కృష్ణలంక ప్రాంతానికి చెందిన క్రైమ్ సస్పెక్ట్ షీటర్ చందు అలియాస్ పూరి ఒక వీడియోను విడుదల చేశాడు..”నేను లాకప్ లోనే ఉన్నాను. అప్పుడు సాయి కృష్ణను తీసుకువచ్చారు. అతడిని తీవ్రంగా కొట్టారు. అతని మీద విపరీతంగా కేసులు ఉన్నాయి. ఆరోజు నన్ను జైలు నుంచి బయటకు పంపించారు. సాయి కృష్ణ మీద కేసులు ఉన్నాయి. అతడు బెయిల్ మీద అనేక సందర్భాల్లో బయటకు వచ్చాడు. ఆరోజు నన్ను స్టేషన్ నుంచి ఎందుకు బయటకు పంపించారో తెలియదు” అని చందు తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. అయితే నాగరాజు చుట్టూ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

హద్దులు దాటేసిన యంగ్ హీరోయిన్.. ప్రతీ డోర్ దగ్గర అలాంటి పనులు చేస్తానంటూ బోల్డ్ కామెంట్స్..

Ananya Nagalla Bold Comments
Ananya Nagalla Bold Comments

Ananya Nagalla Bold Comments: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు అనన్య నాగేళ్ల. ఈమధ్య కాలం లో ఈమె వార్తల్లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన విషయం లో ఈమె కూడా ఈడీ అధికారుల వద్ద విచారణ ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆమె అందుకు వివరణ కూడా ఇచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే , సినిమాల్లో ఈమె గ్లామరస్ రోల్స్ లో కనిపించదు కానీ , తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మాత్రం హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను మెంటలెక్కిపోయేలా చేస్తోంది. లేటెస్ట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి సబ్ స్క్రిప్షన్ అనే ఫీచర్ ని జత చేసుకుంది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేగింది.

సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ లక్షలు బాగానే సంపాదిస్తున్నావ్ , విష్ణు ప్రియా వంటి వారు అయితే , సాధారణ టీవీ యాంకర్స్, వాళ్లకు పెద్దగా ఆదాయం ఉండదు కాబట్టి , సబ్ స్క్రిప్షన్స్ ద్వారా అందాలను ఆరబోస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు , కానీ నీకమైంది?, ఒక యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ వి అయ్యుండి ఇంతలా దిగజారాలా అంటూ సోషల్ మీడియా లో అనన్య నాగేళ్ల పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అనన్య నాగేళ్ల ఈ విమర్శలను , ట్రోలింగ్స్ ని అసలు పట్టించుకోవడం లేదు. తన మనసుకి నచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. లేటెస్ట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ , దానికి ఆమె పెట్టిన బోల్డ్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది. పొట్టి దుస్తులు ధరించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘కనిపించిన ప్రతీ తలుపు వద్ద ఫోటోలు దిగితే ఇలాగే ఉంటుంది.. ? ఇదే కదా మీరు ఇప్పుడు చేయబోయే కామెంట్, నాకు ముందే తెలుసు’ అంటూ వెటకారంగా చెప్పుకొచ్చింది.

ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక అనన్య నాగేళ్ల సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఈమె 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం లో ఈమె కీలక పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ , క్రేజ్ తో వరుసగా సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. హీరోయిన్ గా మాత్రమే కాదు , క్యారెక్టర్ రోల్స్ లో కూడా మెరుస్తూ తన మార్కు ని చూపించుకుంది. ప్రస్తుతం ఆమె ‘లేచింది మహిళా లోకం’, ‘లీసా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

ఇది ప్రపంచానికి తెలియని చైనా మురికి.. చూసి తరిస్తారా

Unknown Facts About China
Unknown Facts About China

Unknown Facts About China: అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదీ సాగదు. ప్రభుత్వం ఏది అనుకుంటే అదే చేస్తుంది. పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తుంది.. గిట్టని దేశాల మీద దాడులు చేస్తుంది.. అవసరమైతే నదుల రూపురేఖలు పూర్తిగా మార్చేసి వరదలతో నాశనం చేస్తూ ఉంటుంది. నిర్బంద కాండ అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపిస్తూ ఉంటుంది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి తెలియాలని కూడా ఆ దేశం అనుకోదు. ఒకరకంగా చెప్పాలంటే తొట్టి నార తీస్తూ ఉంటుంది.

ప్రపంచంలో కమ్యూనిజం అంటే ఏంటో తమను చూసి నేర్చుకోవాలని చెప్పే ఆ దేశ పరిపాలకులు ఉదయం సమన్యాయం గురించి.. రాత్రి పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారు. క్రోనీ క్యాపిటలిజం అని పుస్తకాల్లో మాత్రమే మనం చదువుకున్నాం. కానీ ఆ దేశంలో ప్రతిక్షణం అది కనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా చెబుతుంటే మీకు ఇప్పటికే ఒక క్లారిటీ రావాలి.. ఆ క్లారిటీ పేరు చైనా.

చైనా అనేది ఒక దుర్మార్గ దేశం. ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి అమెరికా పెట్టింది పేరైతే.. దానికి మించి పది ఆకులు ఎక్కువ చదువుకుంది చైనా. చైనాలో సిద్ధాంతాలు.. సమన్యాయాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. అక్కడ జరుగుతున్నది కేవలం క్రోనీ క్యాపిటలిజం మాత్రమే. ఈ విషయాన్ని నేరుగా చెబితే చైనా పరిపాలకులు ఒప్పుకోరు.. మన దేశంలో ఉన్న సో కాల్డ్ ఎర్రి సన్నాసులు కూడా అంగీకరించరు.

ప్రపంచానికి చైనా అభివృద్ధి మోడల్ గా కనిపిస్తూ ఉంటుంది. పెద్దపెద్ద భవనాలతో ఆ దేశం నిండుగా దర్శనమిస్తూ ఉంటుంది.. కానీ, చైనా లో మరో కోణం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మురికివాడలు ఎక్కువగా ఉంటాయి. కరెంటు ప్రసారం కాని ప్రాంతాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.. మురికివాడలలో ప్రజలు ఇబ్బంది పడుకుంటూ సాగిస్తున్న జీవనం
.. తాగునీటి కోసం పడుతున్న ఇబ్బంది.. ఒకే బెడ్ మీద ముగ్గురు, నలుగురు పడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రపంచానికి తెలియని చైనా అంటూ.. ఇది ఆ దేశానికి సంబంధించిన మురికి బాగోతం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఈ వీడియో చూసిన తర్వాత మన దేశంలో ఉన్న ఎర్రి సన్నాసులు ఎలా కామెంట్ చేస్తారో చూడాల్సి ఉంది.

కొత్త సన్నివేశాలు జత చేసినప్పటికీ పెరగని 'పెద్ది' వసూళ్లు.. 15వ రోజు వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi 15th Day Collections
Peddi 15th Day Collections

Peddi 15th Day Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బలమైన థియేట్రికల్ రన్ లో రీసెంట్ గానే 300 కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రానికి 400 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు కానీ, ఆ రేంజ్ వసూళ్లు అసలు రాలేదని , వాస్తవానికి ఇప్పటి వరకు 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా డ్రీం రన్ ఈ వీకెండ్ తో ముగిసిపోయేట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే 11 రోజుల తర్వాత వసూళ్లు బాగా డౌన్ అయిపోయాయి.

14 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 15 వ రోజున 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది , ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. దీంతో ‘పెద్ది’ థియేటర్స్ కూడా బాగా తగ్గాయి. ఆ కారణం చేత నేడు కనీసం 50 లక్షల షేర్ వసూళ్లు అయినా వస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో ‘పెద్ది’ చిత్రానికి పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో , ఆ రేంజ్ థియేట్రికల్ రన్ వచ్చిందని , ఇప్పుడు పోటీ ఉండడం తో బాగా డౌన్ అయ్యిందని అంటున్నారు.

కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయి అనే విషయాన్ని గ్రహించిన నిర్మాతలు , నిన్నటి నుండి థియేటర్స్ లో కొత్త సన్నివేశాలు జత చేసిన సరికొత్త వెర్షన్ ని థియేటర్స్ లో రీ లోడ్ చేశారు. ఈ కొత్త సన్నివేశాల కారణంగా కచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయని అనుకున్నారు. కానీ నిర్మాతల అంచనాలు తప్పాయి , ముందు రోజు తో పోలిస్తే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ , ఎలాంటి పెరుగుదల లేదు. కనీసం వీకెండ్ లో అయినా ఈ సరికొత్త సన్నివేశాల ప్రభావం కలెక్షన్స్ పైన కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక పోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 144 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 220 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగ, వరల్డ్ వైడ్ గా 196 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 331 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అల్లు అర్జున్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన హై కోర్టు.. దెబ్బ మీద దెబ్బ..

Allu Arjun Request Rejected
Allu Arjun Request Rejected

Allu Arjun Request Rejected: 2024, డిసెంబర్ 4 న హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులను ఎదురుకున్నాడో అందరికీ తెలిసిందే. పోలీసులు ఆయన్ని ఈ ఘటన కారణంగా అరెస్ట్ కూడా చేశారు. రేవతి అనే మహిళా చనిపోవడం , ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం వంటివి తల్చుకుంటే , ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. పగోడికి కూడా అలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదు అని కోరుకున్న సందర్భాలు అవి. కాలం గడిచేకొద్దీ జనాలు ప్రతీ విషయాన్ని మర్చిపోతుంటారు. అలా ఈ సంఘటన ని కూడా చిన్నగా మర్చిపోవడం మొదలు పెట్టారు జనాలు. అయితే నేడు నాంపల్లి హై కోర్టు అల్లు అర్జున్ కి ఊహించని షాక్ ఇచ్చింది.

ఈ ఘటనలో అల్లు అర్జున్ తో పాటు, 18 మందిని నిందితులుగా గుర్తించి నాంపల్లి హై కోర్టు నేడు సమన్లు పంపింది. వచ్చే సోమవారం , అనగా జూన్ 22 న కచ్చితంగా హైకోర్టు కి వచ్చి విచారణకు హాజరవ్వాలని అల్లు అర్జున్ ని హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆరోజు తానూ ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఉంటానని, ఆ ఒక్క రోజు వ్యక్తిగత విచారణ కాకుండా, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణ ఉండేలా ప్లాన్ చేయాల్సిందిగా హై కోర్టు కి అల్లు అర్జున్ రిక్వెస్ట్ పిటీషన్ ని పెట్టుకున్నారు. అయితే ఈ పిటీషన్ ని రిజెక్ట్ చేసిన హైకోర్టు , ఎట్టి పరిస్థితి లోనూ ఈ నెల 22 న హై కోర్టు కి రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ విచారణకు సోమవారం రోజున వస్తాడా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ అల్లు అర్జున్ రాకపోతే న్యాయపరమైన చర్యలు ఉంటాయా?, పోలీసులు మరోసారి ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ ఘటన లో అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిన శ్రీతేజ్ , ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు కానీ , మనుషులను గుర్తించలేకపోతున్నాడు , అన్నం తినడం కూడా అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓవరాల్ గా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ దురభిమానులు , అల్లు అర్జున్ ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కోట్లు వస్తున్నాయని సంబరపడితే.. చివరికిలా.. పాపం పంత్

Rishabh Pant IPL News
Rishabh Pant IPL News

Rishabh Pant IPL News: 2024 ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు రిషబ్ పంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీనికి ప్రధాన కారణం 20 కి పైగా కోట్లు పెట్టి లక్నో జట్టు యజమాని గోయంక అతడిని కొనుగోలు చేయడమే. ఢిల్లీ నుంచి పంత్ బయటకు వచ్చి ఆ స్థాయిలో డబ్బు దక్కించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎంతో సీనియార్టీ ఉన్న ప్లేయర్లు కూడా ఆ స్థాయిలో ధర దక్కించుకోలేక ఇబ్బంది పడుతుంటే.. పంత్ మాత్రం సులువుగా ఆ పని చేయగలిగాడు. అంతేకాదు అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించ గలిగాడు.

ఆ స్థాయిలో డబ్బు పెట్టిన తర్వాత గోయంక ఎందుకు ఊరుకుంటాడు.. పంత్ మీద ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. మామూలుగా కాదు.. 2025 సీజన్లో ఒత్తిడి తట్టుకోలేక పంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. కొన్ని సందర్భాలలో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అంతేకాదు, ఓనర్ స్థానం నుంచి వన్ డౌన్, మిడిల్ ఆర్డర్.. లోయర్ ఆర్డర్ స్థాయికి తనను తాను దిగజార్చుకున్నాడు.. అయినప్పటికీ అతని ఆట తీరు మారలేదు. అతడి న్యాచురల్ స్టైల్ బ్యాటింగ్ కనిపించలేదు.

2026 సీజన్లో కూడా పంత్ అలానే ఉండిపోయాడు. ఆట తీరు మారలేదు. తన దూకుడు కనిపించలేదు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టే అతడు నిస్తేజంగా ఉండిపోయాడు. ఫలితంగా లక్నో జట్టు దారుణమైన ఓటములు ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలోనే తన కెప్టెన్సీ ని వదులుకుంటున్నట్టు పంత్ ప్రకటించాడు. ఫలితంగా లక్నో జట్టు 2027 సీజన్ కి కొత్త సారధిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జాతీయ మీడియాలో సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి.

పంత్ వచ్చే సీజన్ నాటికి ఢిల్లీ జట్టుకు వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. తనను నాయకుడిని చేసిన ఢిల్లీ మేనేజ్మెంట్ కు అతడు కృతజ్ఞతగా మళ్లీ అందులోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ జట్టు నుంచి కులదీప్ యాదవ్ లక్నోకు వెళ్ళిపోతున్నాడని కూడా తెలుస్తోంది. లక్నో జట్టు సారధిగా ఇప్పటికే తప్పుకున్నాడు. కాగా ఢిల్లీ కెప్టెన్ గా కొనసాగుతున్న అక్షర్ పటేల్ ను తప్పించి.. రాహుల్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇంగ్లాండ్ టూర్ కు ఇన్ని మార్పులా.. అసలు టీమ్ ఇండియాను ఏం చేయబోతున్నారు..

England Tour Team India
England Tour Team India

England Tour Team India: 2027 లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భారత జట్టు గట్టిగా భావిస్తోంది. ఇటీవల టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడం.. అంతకుముందు ఆసియా కప్ సాధించడం.. తాజాగా t20 వరల్డ్ కప్ గెలవడం.. ఇవన్నీ కూడా వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా స్థాయిని నిరూపించాయి.

టీమిండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ గెలిచింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీని అందుకుంది. అంతకుముందు ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో అందుకుంది. తద్వారా టీమిండియా గతంలో దక్షిణాఫ్రికా.. అంతకంటే ముందు ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ జట్లతో ఎదురైన దారుణమైన ఓటములకు లేపనం లాగా ఈ విజయాన్ని మార్చుకుంది. ఇక వైట్ బాల్ ఫార్మేట్ విషయంలో టీమిండియా తిరుగులేని స్థాయిలో దూసుకుపోతోంది. ఆసియా కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టి20 వరల్డ్ కప్.. విజయాలు టీమిండియా స్థాయిని నిరూపిస్తున్నాయి.

వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా జట్టు విషయంలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ పూర్తి అయిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ టూర్ వెళ్తుంది. ఈ సిరీస్ వన్డే వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు అత్యంత ముఖ్యం.. హార్దిక్ పాండ్యా, బుమ్రా, విరాట్ కోహ్లీ జట్టులోకి రాబోతున్నారు. జూరెల్ బ్యాకప్ కీపర్ గా రేసులో ఉన్నాడు. జైస్వాల్ రిజర్వ్ ఓపెనర్ గా ఉండే అవకాశం ఉంది.. ఆల్ రౌండర్ స్థానం కోసం అక్షర్ పటేల్ పోటీ పడుతున్నాడు. అదనపు పేసర్ స్థానం కోసం యువ ఆటగాళ్ల మధ్య విపరీతంగా పోటీ ఉంది.

గిల్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అయ్యర్.. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా.. కేఎల్ రాహుల్.. నితీష్ కుమార్ రెడ్డి.. కులదీప్ యాదవ్.. మహమ్మద్ సిరాజ్.. కిషన్.. వాషింగ్టన్ సుందర్.. బుమ్రా.. అర్ష్ దీప్ సింగ్.. హర్షిత్/ గుర్న్/ రానా/ ప్రిన్స్ యాదవ్/ యుద్వీర్ సింగ్ వంటి వారితో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

హై సెక్యూరిటీ జోన్‌లో స్పై కెమెరాలు.. జాతీయ భద్రతకు సవాల్‌!

Spy Cameras In High Security Zone
Spy Cameras In High Security Zone

Spy Cameras In High Security Zone: అమృత్‌సర్‌లోని అత్యంత భద్రతా ప్రాంతాల్లో రహస్యంగా అమర్చిన కెమెరాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతాలు సైనిక ఉన్నతాధికారులు తిరిగే ప్రదేశాలు. కెమెరాలు మూడు నెలలుగా పనిచేస్తున్నాయని తెలిసింది. ఇవి సౌరశక్తి (సోలార్‌ పవర్‌)తో నడిచే సీసీటీవీ కెమెరాలు. అమృత్‌సర్‌ నగరం మొత్తాన్ని కవర్‌ చేసేలా అమర్చబడ్డాయి. ఈ కెమెరాలు రహస్యంగా ఉండేలా డిజైన్‌ చేయబడ్డాయి, కాబట్టి వాటిని సాధారణంగా గుర్తించడం కష్టం.

శత్రువల చేతికి డేటా..
ఈ కెమెరాలు సిమ్‌ కార్డుల సాయంతో రికార్డ్‌ చేసిన దృశ్యాలను నేరుగా పాకిస్తాన్, కెనడాకు పంపుతున్నాయి. ముఖ్యంగా, భారత సైన్యం యొక్క ఎక్స్‌ కార్ప్‌స్, హెడ్‌క్వార్టర్స్, సైనిక హౌసింగ్‌ కాలనీలు, ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్, విమానాశ్రయం వంటి సున్నితమైన ప్రాంతాలను లైవ్‌గా నిఘా వేస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఈ దృశ్యాలను నేరుగా చూస్తున్నట్లు సమాచారం వెల్లడైంది. సోలార్‌ పవర్‌ వల్ల కెమెరాలు రాత్రింబగళ్లు పనిచేయగలిగాయి, సిమ్‌ కార్డులు దూర ప్రాంతాలకు డేటా పంపడానికి సహాయపడ్డాయి.

ఇద్దరి అరెస్టు..
ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అమృత్‌సర్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారి సహాయంతో కెమెరాలు అమర్చినట్లు, డేటా ప్రసారం చేసినట్లు తేలింది. పోలీసులు ఈ కెమెరాలు ఎలా అమర్చబడ్డాయి, ఎవరి సహాయంతో అనే విషయాలపై విస్తృతంగా విచారణ చేస్తున్నారు. ఈ అరెస్టులు ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలించడానికి సహాయపడ్డాయి.

ఎలా గుర్తించారు..
ఈ రహస్య కెమెరాలు భద్రతా దళాలు నిర్వహించిన రొటీన్‌ నిఘా పర్యటనలో గుర్తించబడ్డాయి. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో అదనపు పరికరాలు ఉన్నాయేమో అని తనిఖీ చేస్తుంటారు. ఈ కెమెరాలు చిన్నవిగా, రహస్యంగా ఉండటం వల్ల మొదట్లో గుర్తించడం కష్టం అయింది. కానీ సాంకేతిక పరిశీలనలో వాటి ఉనికి బయటపడింది.

భద్రతకు సవాల్‌..
ఈ సంఘటన జాతీయ భద్రతపై తీవ్రమైన సవాల్‌గా మారింది. సైనిక ఉన్నతాధికారుల కదలికలు, ముఖ్యమైన సంస్థలు, విమానాశ్రయం వంటి సున్నితమైన ప్రాంతాలపై రహస్య నిఘా ఏర్పాటు చేయడం అనేది సాధారణ నేరం కాదు. ఇది విదేశీ శక్తులు లేదా ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయో చూపిస్తుంది. సోలార్‌ పవర్, సిమ్‌ కార్డుల ఉపయోగం ఈ కెమెరాలను గుర్తించడం కష్టతరం చేసింది. దృశ్యాలు నేరుగా పాకిస్తాన్, కెనడాకు వెళ్లడం అంతర్జాతీయ కోణాన్ని కూడా సూచిస్తుంది. ఇది భారతదేశం యొక్క భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. అయితే, ఈ సంఘటన నుంచి ముఖ్యమైన పాఠం ఏమిటంటే భద్రతా ప్రాంతాల్లో నిరంతర నిఘా, సాంకేతిక పర్యవేక్షణ అవసరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపరచడం, అంతర్జాతీయ సహకారం పెంచడం, స్థానిక స్థాయిలో అప్రమత్తత పెంచడం అవసరం.

ముగిసిన 35 ఏళ్ల ప్రయాణం.. జార్జి బుష్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ వరకు..

Boeing 747-200 History
Boeing 747-200 History

Boeing 747-200 History: అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌కు చెందిన ఒక ముఖ్యమైన విమానం తన దీర్ఘకాలిక విధులను ముగించింది. బోయింగ్‌ 747–200 ఆధారంగా రూపొందించిన ఈ విమానం 35 సంవత్సరాలపాటు అగ్రరాజ్య నాయకత్వానికి చిహ్నంగా నిలిచింది. ఇప్పుడు అది విశ్రాంతి తీసుకుంటూ కొత్త తరం విమానాలకు బాధ్యతలు అప్పగిస్తోంది.

బోయింగ్‌ 747–200 ప్రత్యేకతలు..
సాధారణ ప్రయాణికుల విమానంగా ఉన్న బోయింగ్‌ 747–200ను పూర్తిగా మార్చి, అధ్యక్షుడి భద్రత, కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. దీనిని వీసీ–25అ అని పిలుస్తారు. గాలిలో ఉన్నప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా సురక్షితమైన సంభాషణలు జరపగలిగే అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థను అమర్చారు. క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే రక్షణ వ్యవస్థలు కూడా ఇందులో భాగం. ఇది కేవలం రవాణా సాధనం కాదు.. ఆకాశంలో తేలే అధ్యక్ష కార్యాలయంగా రూపొందించబడింది.

అధ్యక్షుల యాత్రల్లో దాని పాత్ర..
జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ కాలం నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ వరకు అమెరికాను నడిపిన అనేక మంది అధ్యక్షులు ఈ విమానాన్ని అంతర్జాతీయ, దేశీయ పర్యటనలకు ఉపయోగించారు. దౌత్య చర్చలు, అంతర్జాతీయ ఒప్పందాలు, సంక్షోభ నిర్వహణ వంటి ముఖ్యమైన సంఘటనల్లో ఈ విమానం లోపలి గదులు చాలా ముఖ్యమైన నిర్ణయాలకు వేదికగా మారాయి. దీని బ్లూ, వైట్‌ రంగుల కలయిక ప్రపంచవ్యాప్తంగా అమెరికా శక్తిని సూచించే దృశ్యంగా మారింది.

సాంకేతికత, భద్రతా సామర్థ్యాలు..
ఈ విమానం సాంకేతికంగా అత్యంత అధునాతనంగా ఉండేది. గాలిలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ప్రపంచ నాయకులతో నేరుగా మాట్లాడగలిగే వ్యవస్థ, శత్రు దాడుల నుంచి రక్షణ ఇచ్చే వ్యవస్థలు దీనిని సాధారణ విమానాల కంటే వేరుగా నిలిపాయి. ఇది అధ్యక్షుడి భద్రతను మాత్రమే కాకుండా, అమెరికా ప్రభుత్వం యొక్క నిరంతర కార్యాచరణను కూడా నిర్ధారించేది. ఇలాంటి సౌకర్యాలు దీనిని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటిగా మార్చాయి.

కొత్త తరం విమానాలకు బాధ్యత..
35 ఏళ్ల సేవ తర్వాత ఈ విమానం తన విధులను ముగించుకుంటోంది. దీని స్థానంలో మరింత ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విమానాలు వస్తున్నాయి. ఇవి మరింత సమర్థవంతమైన కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతో రూపొందించబడ్డాయి. పాత విమానం ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ భవిష్యత్తులో మ్యూజియంలో ప్రదర్శనకు వెళ్లే అవకాశం ఉంది. ఇది అమెరికా విమానయాన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసినట్లు సూచిస్తోంది.

ఈ విమానం కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు. అమెరికా అధ్యక్షుడి శక్తి, భద్రత, ప్రపంచ నాయకత్వానికి దృశ్యమాన చిహ్నంగా నిలిచింది. దీని సేవలు ముగియడం అంటే ఒక యుగం ముగిసినట్లే. కొత్త విమానాలు రాబోతున్నప్పటికీ, ఈ 35 ఏళ్ల పాత విమానం అమెరికా చరిత్రలో దౌత్యం, సంక్షోభ నిర్వహణ, అధ్యక్ష రక్షణ అనే అంశాలను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఈ మార్పు అమెరికా సాంకేతిక పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లే సంకేతం.

చిరంజీవి పెద్ది మూవీ రిజల్ట్ చూసి రామ్ చరణ్ కి క్లాస్ పీకాడా..?

Peddi OTT Release
Peddi OTT Release

Chiranjeevi Advice To Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులందరు వాళ్ల సినిమాలనే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతుంటారు. స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ సినిమాలకి ఉన్న ఆదరణ మిగతా హీరోలకు దక్కదు. ఇక ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో ఉన్న ఆడియన్స్ అయితే స్టార్ హీరోల సినిమాలను రిపీటెడ్ గా చూడడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక రామ్ చరణ్ సైతం ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

వాళ్ల నుంచి వచ్చిన ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా ఆ మూవీ పెద్దగా సక్సెస్ ను సాధించలేదు. పెద్ది సినిమా విషయంలోనే ఆయన కొంతవరకు తడబడ్డాడు. మొత్తానికైతే పెద్ది సినిమా రిజల్ట్ చూసిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది.

కథల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలని దర్శకుడు ఏది చెప్తే అది నమ్మొద్దని వాళ్ళు చెప్పిన కథను చెప్పినట్టుగా స్క్రీన్ మీద చిత్రీకరిస్తున్నారా? లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలని రామ్ చరణ్ కి చెప్పారట. మొత్తానికైతే చిరంజీవి తన అనుభవం దృష్ట్యా చెప్పిన మాటలను రామ్ చరణ్ స్వీకరించినట్టుగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో దర్శకులు హీరోలను ఒప్పించడానికి వాళ్ల క్యారెక్టర్లు హైలెట్ అవుతుందని చెప్పి మరి సినిమాను ఓకే చేయిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సీన్స్ కి తీసే సీన్స్ కి అసలు సంబంధం ఉండదు. గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగిందని చిరంజీవి రామ్ చరణ్ ని మందలించారట.

ఇక పెద్ది సినిమా విషయంలో బుచ్చిబాబు చెప్పింది చెప్పినట్టుగా తీసినప్పటికి సినిమాలో ఏదో అసంతృప్తి అయితే ఉందని అది ప్రేక్షకులకు అంత పెద్దగా కనెక్ట్ కావడం లేదని చిరంజీవి రామ్ చరణ్ తో కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ని సాధిస్తుంది. ఎంతటి బజ్ ను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది…

సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్ కి వెళ్తున్న వెంకటేష్..

Venkatesh Top Senior Hero
Venkatesh Top Senior Hero

Venkatesh Top Senior Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వరుస సినిమాలను చేస్తుంటే సీనియర్ హీరోలు సైతం తెలుగు సినిమాల హవాని పెంచుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పోటీని ఇచ్చే విధంగా మన సినిమాలు ఉండడం మన కంటెంట్లు కొత్తగా ఉండటం, ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుండటంతో మన సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తుంది…ఇక విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు సైతం తెలుగులో వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు. గత సంవత్సరం ‘సంక్రాంతి వస్తున్నాం ‘ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ఒక క్యామియో రోల్ పోషించాడు. ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడు. ఇక మొత్తానికైతే అటు త్రివిక్రమ్ తో ఇటు అనిల్ రావిపూడి తో సినిమాలు చేస్తున్న వెంకటేష్ రెండు సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

సంవత్సర వ్యవధిలోనే ఈ రెండు సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను అతని వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక తన సినిమా లైనప్ కూడా చాలా బాగా సెట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ ఇద్దరు దర్శకుల తర్వాత తను ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటి రాలేదు.

కానీ మొత్తానికైతే పర్ఫెక్ట్ గా సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుండటంతో ప్రతి ఒక్కరు వెంకటేష్ ని అప్రిషియేట్ చేస్తున్నారు…ఇక వెంకటేష్ మూవీస్ మినిమం గ్యారంటీ సినిమాలు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు… చూడాలి మరి అవి ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనేది…

శాస్త్రవేత్తలు కాదు.. ఉపగ్రహాలూ కాదు..ఎల్ నీనో గురించి నేరేడు చెట్లు ముందుగానే చెప్పేశాయ్..

Jamun Trees Predicted El Nino
Jamun Trees Predicted El Nino

Jamun Trees Predicted El Nino: కత్తెర కార్తె లో వర్షాలు పడకూడదు. అలా వర్షాలు కురిస్తే కరువు వస్తుంది. సూర్యుడు అస్తమించే దిక్కులో ఎరడాలు (ఎరుపు రంగులో ఉన్న చారికలు) వేయాలి. దక్షిణం, తూర్పు మధ్య భాగంలో ఉరుము పుట్టాలి. మేఘం ఏర్పడాలి. అప్పుడే వర్షాలు కురుస్తాయి.. సంక్రాంతి సమయంలో సంక్రుడు(తెలంగాణ ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో ఎడ్ల పండుగప్పుడు మట్టితో చేసే దేవుడు) వరాహం మీద ఊరేగాలి. అప్పుడే కాలం గట్టిగా అవుతుంది. మెండుగా వర్షాలు కురుస్తాయి.. ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు ఏదో ఒక సందర్భంలో మనకు చెబుతూనే ఉంటారు. అదంతా మూఢ నమ్మకమని.. పెద్దవాళ్ళకు ఏం తెలియదని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ సైన్స్ కూడా చేదించలేని అద్భుతమైన జ్ఞానం అది. ప్రకృతిని అంచనా వేస్తూ.. ప్రకృతితో మమేకమవుతూ జీవనం సాగిస్తున్న వారికి ఆ విషయాలు తెలుస్తాయి.

నేటి చాట్ జీపీటీ కాలంలో కూడా.. శాస్త్రవేత్తలు ముందుగా చెప్పలేనిది.. ఉపగ్రహాలు అంచనా వేయలేనిది నేరేడు చెట్టు చెప్పేసింది. ఈ సంవత్సరం ఎన్నడు లేనివిధంగా నేరేడు చెట్లు కాయలుకాచాయి. ఆకులతో సమానంగా ఒక్కో చెట్టుకు కాయలు ఉన్నాయి. అయితే ఇలా బంపర్ క్రాఫ్ నమోదు వెనుక ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ప్రకృతిలో మార్పులు.. మనుగడ సాగించేందుకు ఎదురయ్య ఇబ్బందులను నేరేడు చెట్లు ముందుగానే అంచనా వేస్తాయి. వాటికి ప్రకృతి నుంచి సంకేతాలు ముందుగానే అందుతాయి. అలాంటప్పుడు తన మనుగడ సాగించడానికి.. నేరేడు చెట్లు విపరీతంగా పండ్లను కాస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పండ్ల ద్వారా తన సంతతిని నేరేడు చెట్లు పెంచుకుంటాయి. అదే సమయంలో కొత్త చిగుళ్ళు వేయడానికి నేరేడు చెట్లు సంకోచిస్తూ ఉంటాయి. కొత్త చిగుళ్లను వేయడానికంటే ముందు పండ్లను ఎక్కువగా కాసేలా చేస్తాయి. తాను బతకడానికంటే.. తన సంతతిని కొనసాగించడానికి నేరేడు చెట్లు ఇష్టపడుతుంటాయి.

తీవ్రమైన కరువు.. ప్రకృతి విపత్తులు జరుగుతాయి అని సంకేతాలు ఉన్నప్పుడే నేరేడు చెట్లు ఇలా చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఎన్నడు లేనివిధంగా నేరేడు చెట్లు విపరీతంగా కాయలు కాచాయి. దీనిని గ్రామీణ ప్రాంత రైతులు తీవ్రమైన కరువుగా భావిస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా ఈ సంవత్సరం వర్షాలు అంతగా కురిసే అవకాశం లేదని చెబుతున్నారు. దీనిని బలపరుస్తూ నేరేడు చెట్లు కూడా విపరీతంగా కాయలు కాచాయి. సరిగ్గా 2003లో కూడా ఇదే తీరుగా నేరేడు చెట్లు కాయలు కాచాయి. దీనిని బట్టి అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా కరువు సంభవిస్తుందని.. సంకేతాలు అదే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఫసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఋతుపవనాల విస్తరణ సాగడం లేదు. ఒకవేళ హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడే వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంటుంది.

జియో మరో సంచలనం.. అందుబాటులోకి AI ఫీచర్.. ఎవరికి ఉపయోగమంటే..

Hey Jio AI Feature
Hey Jio AI Feature

Hey Jio AI Feature: దేశంలో టెలికాం రంగంలో సంచలన మార్పులకు నాంది పలికిన జియో మరో కీలక అడుగు వేయబోతోంది. ఇటీవల జరిగిన రిలయన్స్ AGM (Annual General Meeting)లో తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన AI ఆధారిత కాలింగ్ అసిస్టెంట్ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ సదుపాయం ద్వారా ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాల్ సమయంలోనే AI సేవలను పొందే అవకాశం కలగనుంది. దీంతో జియో యూజర్లకు ఇది చాలా వరకు ఉపయోగపడనుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..

జియో యూజర్లకు అందుబాటులోకి వచ్చరే ఈ కొత్త ఫీచర్‌లో వినియోగదారుడు కాల్‌లో ఉండగానే ‘Hey Jio’ అని పలికితే AI ఏజెంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత వాయిస్ కమాండ్ల ద్వారా వివిధ పనులను నిర్వహించవచ్చు. దీంతో ఫోన్‌లో వేరే యాప్‌లు ఓపెన్ చేయకుండానే అనేక సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.ప్రత్యేకంగా కాల్ ముగిసిన తర్వాత మొత్తం సంభాషణకు సంబంధించిన సమ్మరీని AI సిద్ధం చేసి ఇస్తుంది. సమావేశాలు, వ్యాపార చర్చలు లేదా ముఖ్యమైన కాల్స్ చేసినప్పుడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వివిధ భారతీయ భాషల్లో కాల్ సారాంశాన్ని అందించే సామర్థ్యాన్ని కూడా జియో తీసుకురానుంది.

కేవలం కాల్ సమ్మరీలకే పరిమితం కాకుండా, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డరింగ్, రిమైండర్లు సెట్ చేయడం, సమాచారం సేకరించడం వంటి అనేక పనులను కూడా ఏఐ ఏజెంట్ నిర్వహించగలదని కంపెనీ తెలిపింది. అంటే కాల్‌లో మాట్లాడుతూనే వినియోగదారులు తమ రోజువారీ అవసరాలను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతతో జియో వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన డిజిటల్ అనుభవాన్ని అందించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సాధారణ మొబైల్ వినియోగదారులకు దగ్గర చేయడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా, 2026 సంవత్సరం చివరి నాటికి ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారిక విడుదల తేదీపై జియో త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. జియో ప్రవేశపెట్టబోతున్న ఈ AI కాలింగ్ అసిస్టెంట్ విజయవంతమైతే, భారత టెలికాం రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI సేవలను నేరుగా మొబైల్ కాల్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశముంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. రూ. 45 వేల లోపు లభించే మోడల్స్ ఇవే..

Best Electric Scooters Under 45000
Best Electric Scooters Under 45000

Best Electric Scooters Under 45000: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ఆఫీస్ లేదా కాలేజీ ప్రయాణాలు చేసేవారు బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఈ-స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు తక్కవ ధరకే ఈ స్కూటర్లను అందించేందుకు సిద్ధంగాఉన్నాయి. ముఖ్యంగా రూ. 45 వేల బడ్జెట్ పరిమితిలో కొన్ని కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. ఆ కంపెనీలు ఏవో చూద్దాం..

కొమాకి ఎక్స్-వన్ :
ఈ బడ్జెట్‌లో గ్రాఫేన్ (Graphene) బ్యాటరీ టెక్నాలజీతో వస్తున్న పాపులర్ మోడల్ ఇది. దీనికి యాంటీ-థెఫ్ట్ అలారం , ఎల్‌ఈడీ లైటింగ్ , మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులకు, ఇళ్లకు దగ్గర్లోని మార్కెట్ పనులకు ఇది చాలా చక్కగా సరిపోతుంది. దీని ధర: సుమారు రూ. 35,000 – రూ. 38,000 (ఎక్స్-షోరూమ్). ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుండి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

యాకుజా రూబీ / న్యూ :
స్టైలిష్ తో పాటు లేటేస్ట్ డిజైన్‌ కోరుకునేవారికి ఈ స్కూటర్ బెస్ట్ ఎంపిక. ఇది చూసేందుకు కాంపాక్ట్‌గా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు సిటీ ట్రాఫిక్‌లో చాలా సులువుగా నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీని ఛార్జింగ్ సమయం 6 నుండి 8 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 55 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లొచ్చు. దీనిని రూ. 38,000 (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయిస్తున్నారు.

ఉజాస్ ఈగో ఎల్ఏ:
తక్కువ ధరలో ఎక్కువ కాలంగా మార్కెట్లో నమ్మకంగా ఉన్న మోడల్ ఇది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు, డిజిటల్ స్పీడోమీటర్ , అల్లాయ్ వీల్స్ వస్తాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. దీని ధర రూ. 35,000 – రూ. 40,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 నుండి 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు.

జెలియో ఈవా ఎకో ఎల్ఎక్స్:
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇందులో సెంటర్ లాకింగ్ సిస్టమ్, కీ-లెస్ డ్రైవ్, యూఎస్‌బీ పోర్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 60 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 43,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అయితే రూ. 45 వేల లోపు లభించే స్కూటర్లలో ఎక్కువ శాతం లెడ్-యాసిడ్ (Lead-Acid) బ్యాటరీలు ఉంటాయి. వీటికి కంపెనీలు సాధారణంగా 1 సంవత్సరం వారంటీ మాత్రమే ఇస్తాయి. ఒకవేళ మీ బడ్జెట్‌ను పెంచుకుంటే మరింత ఎక్కువ కాలం మన్నిక వచ్చే లిథియం-అయాన్ బ్యాటరీ స్కూటర్లు లభిస్తాయి.