Home Blog Page 99

ఈ రాశుల వారిపై ఈరోజు శని దేవుడి ప్రభావం.. అనుకున్న పనులన్నీ సక్సెస్..

Today 20 June 2026 Horoscope
Today 20 June 2026 Horoscope

Today 20 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అన్ని విజయాలే సమకూరుతాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగుపడతారు. పెండింగ్ బకాయిలను తిరిగి చెల్లిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా మారుతారు. ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి మార్గం ఏర్పడుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ఆలోచన ఉంటే మానుకోవడం మంచిది. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి కొన్ని మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఒత్తిడికి లోను కాకుండా పనులను పూర్తి చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో మాట తీరుపై కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఆధారంగా బాధ్యతలు ఏర్పడతాయి. ఇదే సమయంలో కొత్త ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త బాధ్యతలను చేపడతారు. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. కొందరు తమ పనితీరు తో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అవసరమైన వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వీరి ఆలోచన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా పనిని ప్రారంభించే వారు ప్రజలను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనుల కారణంగా బిజీగా మారిపోతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరి వ్యక్తుల కదలిక వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉండడంతో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారంలో నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇది సరైన సమయం కాదు.

ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..

Deep Sleep Tips
Deep Sleep Tips

Sleep Deprivation: ప్రస్తుత కాలంలో చాలా మంది రకరకాల సమస్యలు బాధపడుతూ ఉన్నారు. దీంతో సరైన నిద్ర పోవడం లేదు. దీంతో ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, తరచూ ఆకలి వేయడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. అయితే వీటిని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి ఇన్సులిన్ నిరోధకత ప్రారంభ సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా రోజుల తరబడి నిద్రలేకపోవడంతో ఏం జరుగుతుందంటే?

కొంత మంది ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వరుసగా నాలుగు రోజుల పాటు గాఢమైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది. దీంతో కణాలు ఇన్సులిన్ ప్రభావానికి తక్కువగా స్పందించడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. నిద్రలేమి కారణంగా ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. అదే సమయంలో ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా వ్యక్తికి తరచూ ఆకలి వేయడం.. ముఖ్యంగా తీపి పదార్థాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది.

ఇన్సులిన్ నిరోధకత ఎక్కువకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర నాణ్యతను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ సమస్యను తగ్గించేందుకు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం.. ఒకే సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. అలాగే ప్రోటీన్లు, ఫైబర్, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక ఊరు.. రెండు నెలల్లో 15 మంది చనిపోయారు.. చేతబడి జరిగిందా..

Ushannapalli Village
Ushannapalli Village

Ushannapalli Village: ఒక ఊరు.. రెండు నెలలుగా శోకాలు పెడుతూనే ఉంది. వల్లకాడులు మండుతూనే ఉన్నాయి. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు చనిపోతున్నారు. ఇలా ఈ గ్రామంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 15 మంది కన్నుమూశారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ విషాదం నుంచి తేరుకోవడానికి అక్కడి ప్రజల వల్ల కావడం లేదు.

కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ గ్రామంలో 15 మంది చనిపోవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇలా 15 మంది చనిపోవడాన్ని అక్కడికి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం ఉషాన్న పల్లి గ్రామంలో ఈ వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు తమ ఊరికి ఏదో కీడు సోకి ఉంటుందని భయపడిపోతున్నారు. కనీసం ఇళ్లల్లో పోయి కూడా వెలిగించడం లేదు. పొద్దంతా ఇండ్లకు తాళాలు వేసే ఉంటున్నారు. ఊరి బయట ఉన్న తోటలోకి వెళ్తున్నారు. అక్కడే వంట చేసుకుని తిని సాయంత్రం పూట మళ్లీ ఇంటి బాట పడుతున్నారు. ఇలా చేయడంవల్ల గ్రామంలో చావులు ఆగిపోతాయని అక్కడి గ్రామస్తులు భావిస్తున్నారు. అలా చేసినప్పటికీ గ్రామాలలో చావులు ఆగడం లేదు.

చనిపోయిన 15 మంది లో రకరకాల వయసులకు చెందిన వారు ఉన్నారు. కొందరు అనారోగ్యంతో చనిపోతే.. మరికొందరేమ ప్రమాదాల వల్ల.. ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు.. అయితే వారంతా చనిపోవడం వెనక వేరువేరు కారణాలు ఉన్నాయి. ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నట్టుగా అక్కడ కీడు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు అంటున్నారు. మనిషి పుట్టడం ఎంత సహజమో.. చనిపోవడం కూడా అంతే సహజమని.. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మడం ఎంతవరకు సమంజసమని చుట్టుపక్కల గ్రామాల విద్యావంతులు పేర్కొంటున్నారు. ఉదయం పూట గృహాలకు తాళాలు వేయడం.. సమీపంలో ఉన్న తోటలకు వెళ్లి భోజనం వండుకొని రావడం అక్కడికి గ్రామస్తులకు అలవాటుగా మారింది.

ఇక్కడ గ్రామస్తులు వరస మరణాలను చూసి భయపడుతున్నారు. అంతేకాదు గ్రామానికి ఎవరో మంత్రాలు చేశారని.. చేతబడి ద్వారా గ్రామంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో ఇవి గ్రామస్తుల మధ్య దాడులకు దారితీస్తున్నాయి. అయితే ఇక్కడ గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వీరిలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది.

పల్లెటూరి పిల్ల ‘నాగదుర్గ’ అందాలు

Nagadurga
Nagadurga

'సేవ్ ది టైగర్స్ 3' వెబ్ సిరీస్ రివ్యూ : ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదు..

Save The Tigers 3
Save The Tigers 3

Save The Tigers 3: ‘ ఓటీటీ వెబ్ సిరీస్ లలో ఈమధ్య కాలం లో ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ప్రియదర్శి , అభినవ్ గోమాటం , చైతన్య కృష్ణ , వెన్నెల కిషోర్, సుజాత, పావని గంగిరెడ్డి , దేవయాని శర్మ, హర్ష వర్ధన్, గంగవ్వ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో నటించారు. ఇప్పటి వరకు ప్రసారమైన రెండు సీజన్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న మూడవ సీజన్ ని విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?, మొదటి రెండు సీజన్స్ ని మించి ఉందా?, లేదా నిరాశపరిచిందా? వంటివి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

గత సీజన్స్ లో జరిగిన గొడవల తర్వాత ముగ్గురు మిత్రుల జీవితాల్లో కొన్ని కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. నటి హంసలేఖ(సీరత్ kapoor) వ్యవహారం ముగిసిన తర్వాత , గంటా రవి (ప్రియా దర్శి) తన భార్య గోల తట్టుకోలేక, ఆమె బలవంతం మీద గేటెడ్ కమ్యూనిటీ కి షిఫ్ట్ అవుతాడు. మరోపక్క రాహుల్ (అభినవ్) తనకు నచ్చని ఉద్యోగం చేస్తూ బాధలు పడుతుంటే , విక్రమ్ (కృష్ణ చైతన్య) తన భార్య తో విడాకుల సమస్యలతో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఒక రోజు తమ జీవితం లో చోటు చేసుకున్న ఈ సంఘటనలకు స్వర్గ లోకం లో ఉన్న ఇంద్రుడే (వెన్నెల కిషోర్) కారణమని, ఫుల్ గా తాగేసి గట్టిగా ఆయన్ని తిడుతారు. వాళ్ళ బాధ ని అర్థం చేసుకున్న ఇంద్రుడు , వారి సమస్యను పరిష్కరించే బాధ్యతని చిత్రగుప్తుడు (గుండు సుదర్శన్) కి అప్పగిస్తాడు. ఒక వింత లైఫ్ ఛేంజింగ్ డీల్ తో చిత్ర గుప్తుడు భూలోకానికి వస్తాడు. ఆ వింత డీల్ ఏంటి?, దాని వాళ్ళ ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు , మలుపులు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఇంతకు ముందు ప్రసారమైన రెండు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త భిన్నమైనది. డైరెక్టర్ ఈసారి సరికొత్త ఫాంటసీ ని జోడించి , మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే కాన్సెప్ట్ కి , మెగాస్టార్ చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ మూవీ కాన్సెప్ట్ ని జోడించి ఈ సిరీస్ ని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం. ఈ సీజన్ మొత్తం చూసేందుకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. మొదటి రెండు ఎపిసోడ్స్ పెద్దగా ఏమి అనిపించవు కానీ , మూడవ ఎపిసోడ్ నుండి అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు అవుతుంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా ఈ సిరీస్ ని చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి.

పవన్ కళ్యాణ్ కాదట కమల కళ్యాణ్ అట.. పీసీసీ చీఫ్ మహేష్ కు ఎందుకింత ఆగ్రహం..

Mahesh Kumar Goud
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: పవన్ కళ్యాణ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఆగడం లేదు. తమ స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. మందుల సామ్యూల్.. అనిరుద్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెడితే చాలు వీరికి విపరీతమైన కోపం వస్తోంది. సమయం, దొరికినప్పుడల్లా సందర్భం లేకుండానే తిట్టేస్తున్నారు. పైగా ఆ తిట్టే విధానంలో కూడా పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ కార్యాలయం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇది జరగగానే వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి వచ్చారు. ఈసారి విమర్శల దాడిని మరింత పెంచారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ పేరు కమల కళ్యాణ్ అంటూ ఆరోపించారు. కమల కళ్యాణ్ తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని.. తెలంగాణకు వచ్చి ఏదో సాధిస్తానని అనుకోవడం పగటి కల అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బిజెపికి అనేక రెక్కలు ఉన్నాయని.. అందులో పవన్ కళ్యాణ్ ఒకడు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే భోజనం పెడతానని.. ఇక్కడ రాజకీయాలు చేస్తానంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను పట్టించుకోవడంలేదని.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా సీరియస్ గా స్పందిస్తారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయబోనని.. ఇంతకుముందే చెప్పారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ స్థాయిలో ఎందుకు స్పందిస్తున్నారు.. తెలంగాణలో తెలంగాణ బిడ్డలు మాత్రమే రాజకీయాలు చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంత ఆవేశపడుతున్నారు.. కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎందుకంత పొలిటికల్ స్పేస్ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటున్నారు.. తనకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదని.. తెలంగాణలో ఏం అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎందుకు బూచిగా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మహేష్ కుమార్ గౌడ్ కు మనుగడ ఉంటుందా.. ఇదే మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీ ఒక సిరీస్ స్టోరీలను పబ్లిష్ చేసింది. ఆ చానల్ కూడా అధికార పార్టీ నాయకుడిది. ఆ ఛానల్ మీద ఇంతవరకు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఆ ఛానల్ అపాలజీ కూడా చెప్పలేదు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తనను తాను ఎందుకు అంత గొప్పగా ఊహించుకుంటున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని.. పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి మాత్రమే బాధ్యతలు అప్పగించారని.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారని జనసేన నాయకులు అంటున్నారు.. ఈ విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ మర్చిపోవడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

పాకిస్థాన్ కు గుర్తింపు కావాలంట..ఓసారి ఆ బ్రహ్మోస్ కు పని చెప్పండి మోడీ సార్

Pakistan US Iran Peace Talks
Pakistan US Iran Peace Talks

Pakistan US Iran Peace Talks: ఒక కుటుంబంలో పిల్లాడికి అందరి ప్రశంస కంటే తండ్రి ప్రశంస ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ తండ్రి అంత ఈజీగా ప్రశంసించడు.. ఏదైనా గొప్ప పని చేస్తేనే శభాష్ అంటూ భుజం తట్టి అభినందిస్తాడు.. ఈ సృష్టిలో అందరికంటే తండ్రి ప్రశంసకు విలువ ఉంటుంది. కానీ, తండ్రి ప్రశంస అంత సులభంగా పిల్లలకు లభించదు.

ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆమధ్య అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించినట్టు పాకిస్తాన్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది. చివరికి తన తాహతుకు మించిన వ్యవహారమైనప్పటికీ.. ఇస్లామాబాదులో ఖరీదైన హోటల్లో చర్చల ప్రక్రియ మొదలుపెట్టింది. ఆ ప్రక్రియ అర్ధాంతరంగా అయిపోయింది. హోటల్ బిల్లు తడిసి పోయింది. ఇంతవరకు ఆ బిల్లును పాకిస్తాన్ చెల్లించలేదు. అనేక దఫాలుగా శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్ ఊదరగొట్టినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అటువంటి సన్నివేశం కనిపించలేదు.

ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ముగించుకున్నాయి. తాత్కాలిక ఒప్పందానికి వచ్చేసాయి. ఇదంతా జరిగిన తర్వాత.. ట్రంప్ తన ఒక్క మాటలో కూడా పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదు. ఇరాన్ కూడా మాట్లాడలేదు. చివరికి గల్ఫ్ దేశాలు కూడా ఏమాత్రం పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా వివరించలేదు. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పోయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ దేశానిది.

ఇవన్నీ ఎలా ఉన్నా సరే.. గతంలో తాము శాంతి చర్చల ప్రక్రియలో కీలకపాత్ర పోషించాం కాబట్టి.. యుద్ధం ముగింపులో పాల్గొన్నం కాబట్టి.. తమ స్థాయిని భారత్ గుర్తించి ఉంటే బాగుండేదని పాకిస్తాన్ పదే పదే కలవర పడింది.. వాస్తవానికి అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన సందిలో పాకిస్తాన్ కేవలం కొరియర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ యుద్ధానికి ముగింపులో ఖతార్ కీలక భూమిక పోషించింది. . అయితే భారత తమను గుర్తించకపోవడం పట్ల పాకిస్థాన్ మంత్రి కావాజా అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ మెచ్చుకొని ఉంటే బాగుండేదని.. ఈ దిశగా తాము ఆలోచిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దేశానికి సొంత గుర్తింపు ఉండదు. భౌగోళికంగా గొప్ప పేరు ఉండదు. అందువల్లే ప్రతి సందర్భంలో భారతదేశంతో పోల్చుకుంటుంది. చివరికి ఎటూ కాకుండా పోతుంది.. పాకిస్తాన్ గుర్తింపు కోసం ఏ స్థాయిలో తహతహలాడుతుందో.. అదే సమయంలో తన ఉనికిని ఏ స్థాయిలో కోల్పోతుందో.. ఈ ఉదంతం నిరూపిస్తోంది.

కోటి శివలింగాల మధ్య 'వారణాసి' షూటింగ్.. రాజమౌళి విజన్ కి మాటల్లేవ్..

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie Shooting: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుండి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా చాలు , నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. ఈ చిత్రం కోసం కేవలం రాజమౌళి , మహేష్ బాబు అభిమానులు మరియు టాలీవుడ్ మూవీ లవర్స్ మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే #RRR తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కాబట్టి. అందులోనూ ఈ చిత్రం లో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ , సైన్స్ ఫిక్షన్ , ట్రిమ్ ట్రావెల్ వంటి జానర్స్ తో పాటు , రామాయణం ఇతిహాసానికి కూడా లింక్ ఉండడం వల్ల , ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో వండర్స్ ని నెలకొల్పుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విరామం లేకుండా సాగుతూనే ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటో ని కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో విడుదల చేశారు. సన్నివేశం నెంబర్ 76, బుల్ -410A షాట్ , టెక్ 1 , డే షూట్ అనే క్లాప్ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో కోటి లింగాలు సెట్ కనిపించడం గమనార్హం. అంటే ప్రస్తుతానికి సినిమాలో హైలైట్ గా నిలవబోయే బుల్ షాట్స్ ని తెరకెక్కిస్తున్నారు అన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెల లోపు పూర్తి చెయ్యాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి సమయానికి ఈ సినిమా పూర్తి అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని పూర్తి చేస్తే , రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డు ని నెలకొల్పబోతుంది అనుకోవచ్చు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లేదా టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘వారణాసి’ నుండి గ్లింప్స్ వీడియో విడుదల చెయ్యాలని అభిమానులు రాజమౌళి ని ట్యాగ్ చేసి చాలా బలంగా కోరుతున్నారు. మరి అభిమానుల కోరికను రాజమౌళి నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , విలన్ గా పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆయన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయ్యిందట.

'హగ్' కావాలంటూ నడిరోడ్డు మీద నిల్చొని బ్రతిమిలాడుతున్న హాట్ హీరోయిన్.. వీడియో వైరల్..

Kriti Sanon
Kriti Sanon

Kriti Sanon: సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉండే టాప్ హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్. ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారమైనది కాదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈమె మన టాలీవుడ్ లో విడుదలైన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారానే వెండితెర అరంగేట్రం చేసింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా , నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ, ఏకంగా నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె నటించిన ‘కాక్ టైల్ 2’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది.

ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందాన హీరో హీరోయిన్లు గా నటించగా, కృతి సనన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా నేడు విడుదలైన మొదటి ఆట నుండి కృతి సనన్ పోషించిన క్యారెక్టర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ లో ఆమె ఈ క్యారెక్టర్ లో జీవించింది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే , అందుకు కారణం కృతి సనన్ అద్భుతమైన నటన వల్లే అని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో , ఈ మూవీ టీం చేసిన హంగామా మామూలుది కాదు. బాలీవుడ్ లోనే వీళ్ళ ప్రమోషన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయం లో కృతి సనన్ తీసుకున్న ఒక క్యూట్ వీడియో ని కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

ఈ వీడియో లో ఆమె ‘నీడ్ ఏ హాగ్’ అంటూ ఒక బోర్డు పట్టుకొని నడిరోడ్డు మీద నిలబడడం , ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ వెనక్కి వచ్చి ఆమెని హాగ్ చేసుకోవడం వంటివి చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ టైం లో తనకు ఎదురైనా అద్భుతమైన అనుభవాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆడియన్స్ తో పంచుకుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియోలను , ఫోటోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Kriti Sanon (@kritisanon)

రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను అడిగాడు.. మరుసటి రోజు శవమయ్యాడు.. జగన్ ఇతడి కుటుంబాన్ని పరామర్శిస్తాడా..

Venugayya Naidu Death Controversy
Venugayya Naidu Death Controversy

Venugayya Naidu Death Controversy: చిక్కటి చిరునవ్వుతో సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఇతడిని కూడా పరామర్శించాలి.. రోడ్డు వెయ్యమని అడగడమే అతడు చేసిన పాపం. అలా అడిగినందుకు అతడికి ఊపిరి లేకుండా చేశారు. సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడంలో పోటీపడిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఇతడి కుటుంబాన్ని పరామర్శిస్తాడా.. తాను అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే చేసిన దారుణాన్ని గుర్తిస్తాడా.. కులాల మీద రాజకీయాలు చేసి.. శవాల మీద రాజకీయాలు చేసి.. అధికారాన్ని దక్కించుకున్న జగన్.. ఒకసారి ఈ వ్యక్తి కుటుంబాన్ని చూడాలని.. తన ఎమ్మెల్యే చేసిన దారుణం గురించి బయట ప్రపంచానికి చెప్పాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి నేతలు చెప్పిన వివరాల ప్రకారం.

అతని పేరు వెంగయ్య నాయుడు.. ఇతడి మీద రౌడీషీట్ లేదు. నేర చరిత్ర కూడా లేదు. ఇతడిది కాపు సామాజిక వర్గం. ఇతడు తన ఊరికి ఒక రోడ్డు వేయాలని స్థానికంగా అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబును అడిగాడు. సరిగ్గా 2021 సింగర్ పల్లి అనే గ్రామంలో జనవరి 23న అన్నా రాంబాబు పర్యటించారు. ఆ సమయంలో వెంగయ్య నాయుడు తమ గ్రామంలో రోడ్డు వేయాలని ఎమ్మెల్యేని ప్రశ్నించాడు. సరిగా మరుసటి రోజు వెంగయ్య నాయుడు కన్నుమూశాడు.

నాడు ఎమ్మెల్యేను రోడ్డు గురించి అడిగితే ఆయన మాట్లాడిన బూతులు మామూలుగా లేవు. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అప్పటికి వెంగయ్య నాయుడు ఎమ్మెల్యే తిడుతున్నప్పటికీ సార్ సార్ అంటూనే మాట్లాడుతున్నాడు. మరుసటి రోజు వెంకయ్య నాయుడు చనిపోవడం అప్పట్లో కలకలం సృష్టించింది. మరి ఇతడి కుటుంబాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సిన అవసరం ఉందని టిడిపి నేతలు అంటున్నారు. సాయి కృష్ణకు కాపు కులాన్ని అంటగట్టి తన సొంత మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్.. వెంగయ్య నాయుడు విషయంలో కూడా అలానే వ్యవహరించాలని టిడిపి నేతలు కోరుతున్నారు.

“ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. సావధానంగా సమాధానం చెప్పలేదు. ఎదురుదాడికి దిగారు. ప్రాణాలు కూడా తీశారు. ఒక సామాన్యుడి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇటువంటి ఘటనను ఏపీ సమాజం ఎలా మర్చిపోతుంది.. ఒక నిరుపేద కుటుంబానికి దిక్కు లేకుండా చేశారు. ఆ రాక్షసానికి ఏం పేరు పెట్టాలి. రోడ్డు వేయాలని అడిగితే అడ్డగోలుగా తిట్టారు. అతడి రక్తం కళ్ళ చూశారు. ప్రశ్నించినందుకు ప్రాణాలు తీశారు. వెంకయ్య నాయుడు చనిపోయాడు. అతని మరణం.. ఎంతోమందికి ప్రశ్నించే అధికారాన్ని ఇచ్చింది. అందువల్లే 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీని పరిమితం చేసిందని” టిడిపి నేతలు పేర్కొంటున్నారు.

మోడీ నుంచి మెలోడీ తీసుకున్న మెలోనీ అంత స్వీట్ కాదు..ట్రంప్ కు కళ్ళల్లో కారం పెట్టింది

G7 Summit
G7 Summit

G7 Summit: ఆ మధ్య మన ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ వెళ్ళినప్పుడు.. ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ తో సర్ప్రైజ్ చేశారు. ఇటలీ ప్రధాని మెలోనికి దానిని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ చాక్లెట్ బ్రాండ్ పేరు మెలోడీ. ఆమె పేరు మెలోడీ కాబట్టి మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. దానికి ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ మెలోడీ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మెలోడీ చాక్లెట్ల విక్రయాలు కూడా మనదేశంలో పెరిగిపోయాయి.

ఇటీవల ఫ్రాన్స్ లో g7 సమ్మిట్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల అధినేతల కంటే ఎక్కువగా మోడీతో మెలోని మాట్లాడింది. ఆయనతో కలిసి ఫోటోలు దిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మరొకసారి ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన చర్చలు సాగాయి. ఇటలీతో భారతదేశానికి వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపరచడానికి నరేంద్ర మోడీ అడుగులు వేస్తే.. మెలోని స్వాగతించారు.

మెలోడీ చాక్లెట్లు తీసుకున్నంత స్వీట్ కాదు మెలోనీ. ఎందుకంటే తను ఒక అగ్గి బరాటా. ఒక ముక్కలో చెప్పాలంటే శివంగి. ఏకంగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కు కోసి కారం పెట్టింది. ఆమెలో ఇంత ఆగ్రహం పెరగడానికి.. ఆమె ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన నెత్తి మాసిన వ్యాఖ్యలు.

ఇటీవల ఫ్రాన్స్ లో g7 సమ్మిట్ జరిగినప్పుడు తనతో ఫోటోలు దిగడానికి మెలోని వేడుకున్నారని ట్రంప్ ఆరోపించారు. ఆయన మాట్లాడిన మాటలు గ్లోబల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెలోని వెంటనే స్పందించారు. ఒక స్వీయ వీడియోలో అమెరికా అధ్యక్షుడికి ఇచ్చి పడేశారు. ” మేము ఎవరితో ఫోటోలు దిగాలని అనుకోలేదు. ఫోటోలు దిగడానికి వేడుకోలేదు. నేను గాని.. మా ఇటలీ గాని ఆ పని చేయదు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆయన పశ్చిమ దేశాలలో శత్రువుల మీద చూపించిన గౌరవం కూడా మా మీద చూపించడం లేదు. అయినప్పటికీ గౌరవాన్ని మేము కోరుకోము. ఎవరికి తలవంచము. ఫోటోలు దిగాలని బతిమిలాడమని” మెలోనీ వ్యాఖ్యానించింది. యూరప్ ప్రాంతంలో ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఈ స్థాయిలో ఇంతవరకు ఏ అధ్యక్షుడుగాని ప్రధానమంత్రి గాని ఇవ్వలేదు. పైగా మెలోని ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడి పరువు మరోసారి బజారు పాలైంది.

మెలోని ఇటలీకి ప్రధానమంత్రి అయిన తర్వాత తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇతర దేశాల మీద ఇటలీని ఆధారపడే విధానాన్ని పూర్తిగా తగ్గించారు. ముఖ్యంగా వాణిజ్యాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్తున్నారు. అందువల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమె మీద మండిపడుతున్నారని గ్లోబల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మండిపడుతున్నారని.. చివరికి ఆ కోపాన్ని ఇలా బయటపెట్టారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సాయి కృష్ణకు.. నవీన్ రెడ్డికి ఎక్కడ గొడవ.. అసలు కథ అప్పుడే మొదలు..

Sai Krishna And Naveen Reddy
Sai Krishna And Naveen Reddy

Sai Krishna And Naveen Reddy: సాయి కృష్ణలంక పోలీసులు ఎందుకు పట్టుకున్నారు.. అతడిని లాకప్ లో ఎందుకు వేశారు.. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు.. సీఐ రాజశేఖర్ అతడి విషయంలో ఎందుకు అంత సీరియస్ అయ్యారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ పోలీసు వర్గాల నుంచి మొదలుపెడితే సామాన్యుల వరకు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఏపీ రాజకీయాలను తీవ్రస్థాయిలో కుదుపునకు గురిచేస్తున్నాయి.

సాయి కృష్ణ వ్యవహారాన్ని ముందుగా తెరపైకి తీసుకువచ్చింది ఏపీ మాజీమంత్రి రాంబాబు. సాయి కృష్ణ చనిపోయాడని చెప్పి.. నవీన్ రెడ్డి ఫోటో చూపించాడు. మొదట్లో మీడియా అంతగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా వైసీపీ అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రచారం చేసింది. చివరికి రాంబాబు చూపించింది నవీన్ రెడ్డి ఫోటో అని తెలియడంతో సాక్షి మీడియా సైలెంట్ అయిపోయింది. అయితే నవీన్ రెడ్డి ఫోటో రాంబాబు చేతికి ఎలా వచ్చింది.. నవీన్ రెడ్డికి, సాయి కృష్ణకు ఏంటి సంబంధం… నవీన్ రెడ్డి శరీరం మీద ఆ గాయాలు ఎందుకు ఉన్నాయి.. అతడు అలా అచేతనంగా ఎందుకు పడి ఉన్నాడు.. ఈ ప్రశ్నలు వెలుగులోకి వచ్చిన తర్వాత సమాధానాలు కూడా అదే స్థాయిలో వ్యక్తమయ్యాయి.

సాక్షి మీడియా సాయికృష్ణ ఆగడాల గురించి ఒక వార్త కూడా రాలేదు. నవీన్ రెడ్డి మరణం గురించి కూడా ప్రస్తావించలేదు. ఇక్కడ సాయి కృష్ణ అనే వాడు రౌడీషీటర్. సాయి కృష్ణ, నవీన్ రెడ్డికి జైల్లో పరిచయం ఏర్పడింది. నవీన్ రెడ్డి మీద భవానిపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉంది. వీరిద్దరికి జైల్లో పరిచయం బయట కూడా కొనసాగింది. వీరిద్దరూ జైలు నుంచి విడుదలైన తర్వాత తమ స్నేహాన్ని కొనసాగించారు.

గత ఏడాది డిసెంబర్ 4న సాయి కృష్ణ, నవీన్ రెడ్డి.. ఇంకా కొంతమంది కలిసి జగ్గయ్యపేట మండలం ధర్మవరపు తండా సమీపంలో మద్యం తాగారు. అక్కడ విందు కూడా చేసుకున్నారు. సాయి కృష్ణ, నవీన్ మధ్య ఫోన్ కు సంబంధించి చిన్నపాటి చర్చ మొదలైంది. అది కాస్త గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో నవీన్ ను సాయి కృష్ణ చెంప మీద కొట్టాడు. దీంతో నవీన్ రెడ్డి ఒక కర్రతో పిల్ల సాయిని గట్టిగా కొట్టాడు. సాయి కృష్ణ కోపం ఆపుకోలేక చేతిలో ఉన్న బీరు సీసాను పగలగొట్టాడు. ఆ తర్వాత నవీన్ ను దారుణంగా పొడిచాడు. నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే నవీన్ రెడ్డి చనిపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా.. నవీన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి ఆవరణలో పడేసి వెళ్లిపోయాడు.

ఈ వ్యవహారంలో సాయి కృష్ణ మీద పోలీసులకు మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. అనేక కేసులు సాయి కృష్ణ మీద నమోదు కావడంతో పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించడం మొదలుపెట్టారు.. అంబటి రాంబాబు చూపించిన ఫోటో సాయి కృష్ణది కాదు. అది నవీన్ రెడ్డిది. ప్రచారం కోసం వైసీపీ నేతలు దిగజారి తప్పుడు ఫోటోలు చూపించారు. చివరికి రౌడీ షీటర్లను పరామర్శించి.. తమ పార్టీ పేరును సార్ధకం చేసుకున్నారని టిడిపి నేతలు అంటున్నారు.

ఇప్పటికీ నాగ చైతన్య పాటలే వింటున్న సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Samantha
Samantha

Samantha: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత నే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అనకాపల్లి నుండి అమెరికా వరకు అదిరిపోయాయి. మీడియం రేంజ్ క్రేజ్ యంగ్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధ్యమా అంటే అనుమానమే. ఇంతటి బలమైన ఓపెనింగ్స్ రావడానికి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక కారణం అయితే, సమంత చేసిన ప్రొమోషన్స్ కూడా ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా సమంత ఇంటర్వ్యూస్ కి సంబంధించిన క్లిప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.

ఈ రేంజ్ లో ఆమె సోషల్ మీడియా ఆడియన్స్ ని తన గ్రిప్ లోకి తీసేసుకుంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఆమె నాగ చైతన్య సినిమా ప్రస్తావన తీసుకొని రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ చాలానే ఉన్నాయి , వాటిల్లో మీరు ఇప్పటికీ వింటున్న మూవీ సాంగ్స్ ఏంటి?’ అని అడగ్గా , అందుకు సమంత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘ఏ మాయ చేసావే’ సినిమా పేరు చెప్పేసింది. తన కెరీర్ లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది అని , అలాంటి క్లాసిక్ కోసం ఎదురు చూస్తున్నానని , ఇప్పటికీ ఆ చిత్రం లోని పాటలు వింటూనే ఉన్నానని చెప్పుకొచ్చింది సమంత. దీనిపై సోషల్ మీడియా లో రకరకాలుగా తమకు తోచినట్టుగా కథనాలు రాసుకుంటున్నారు నెటిజెన్స్.

సమంత ఇప్పటికీ నాగ చైతన్య మీద ఇష్టం పోగొట్టుకోలేదని , అందుకే ‘ఏ మాయ చేసావే’ చిత్రం గురించి చెప్పుకొచ్చిందని అంటున్నారు. సమంత , నాగ చైతన్య ఇద్దరూ కూడా రెండవ పెళ్లి చేసుకొని , వాళ్ళ జీవితాలను సంతోషంగా లీడ్ చేస్తున్నారు, అలాంటిది ఇప్పటికీ వాళ్ళ మధ్య ఇలాంటి లింకులు పెట్టడం అన్యాయం, ‘ఏ మాయ చేసావే’ చిత్రం నిజంగా సమంత కి ఎంతో స్పెషల్ , ఆ చిత్రం ద్వారా నాగ చైతన్య తనకు పరిచయం అయ్యాడు అని కాదు, ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది కాబట్టి. అంతకు మించి మీరు ఊహించుకున్నట్టుగా ఏమి లేదని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Chandra Kanth Kollu (@actor_chandu24)

నితిన్ మూవీ నుండి తప్పుకున్న యంగ్ హీరోయిన్.. ఇంకెన్ని అవమానాలు తట్టుకోవాలి బాస్..

Nithin
Nithin

Nithin: కాలం కలిసి రానప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిలో చులకన అయిపోతాం, ముఖ్యంగా సినీ రంగం లో ఎప్పుడూ ఒకేలా ఉండదు , సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా, సక్సెస్ లేనప్పుడు మరోలాగా ఉంటుంది. ముఖ్యంగా సక్సెస్ లేని సమయం , నీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ దృష్టిలో కూడా లోకువ అయిపోతాము. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ పరిస్థితి అలాగే ఉంది. కెరీర్ ప్రారంభం లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ , మెగాస్టార్ చిరంజీవి కి సైతం లేనటువంటి రికార్డ్స్ వచ్చాయి. అయితే సక్సెస్ ద్వారా వచ్చిన ఆ ఫేమ్ ని నితిన్ సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం లో చూపించలేకపోయారు. ఆ కారణం చేత వరుసగా 14 డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. చేసిన సినిమాని రేలసే కూడా చెయ్యలేని రేంజ్ మార్కెట్ కి పడిపోయాడు.

అలాంటి స్థాయి నుండి నితిన్ కం బ్యాక్ ఇస్తాడని ఎవరైనా ఊహించారా?, కానీ ‘ఇష్క్’ చిత్రంతో దిమ్మతిరిగే రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాలుగైదు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి , కెరీర్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు అయ్యింది. ‘భీష్మ’ చిత్రం కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యేసరికి , మరో రెండు హిట్స్ పడితే నితిన్ స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఆ సినిమా తర్వాత ఈయన చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా నితిన్ గత చిత్రం ‘తమ్ముడు’ కి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు , నితిన్ తో తీయాల్సిన ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని దేవి శ్రీ ప్రసాద్ తో తీస్తున్నాడు.

నితిన్ సినిమాతో నిర్మాతగా వెండితెర అరంగేట్రం చేసి, అతని సినిమా టైటిల్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు కూడా ఇప్పుడు నితిన్ తో సినిమా తీసే సాహసం చేయడం లేదు. అంతే కాకుండా లేటెస్ట్ గా విక్రమ్ కె కుమార్ తో కూడా నితిన్ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కారణం ఆయనకు మార్కెట్ పడిపోయిందని నిర్మాతలు వెనకడుగు వేయడం వల్లే. ఇలా వరుసగా రెండు అవమానాల తర్వాత, నితిన్ కి ఇప్పుడు మరో అవమానం ఎదురైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి నారి సరిసవాడ , సోమశేఖర్ అనే ఇద్దరు యువ దర్శకులు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రితిక నాయక్ ని ఎంచుకున్నారు. కానీ మిరాయ్ తర్వాత ఆమె రెమ్యూనరేషన్ భారీ గా పెంచడంతో అంత ఇచ్చుకోలేక ఆమెని సినిమా నుండి తప్పించి , వైష్ణవి చైతన్య ని తీసుకున్నారు. ఇలా నితిన్ కి అవమానాల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు.

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'నాగబంధం' ట్రైలర్.. 100 కోట్ల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఎలా సాధ్యం..

Naga Bandham Pre Release Business
Naga Bandham Pre Release Business

Nagabandham Trailer: క్వాలిటీ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నా రోజులివి. హీరో ఎవరైనా కానీ , ప్రేక్షకులకు కావాల్సిన సరైన కంటెంట్ అందిస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానమైన కలెక్షన్స్ ని ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఇటీవల కాలం లో ఇలాంటి సందర్భాలు హాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చూస్తూ వచ్చాము. మన టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ రీసెంట్ గానే మొదలైంది. అందుకే కొత్త హీరోల మీద కూడా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసం చేస్తున్నారు. అలా తీసిన చిత్రమే ‘నాగ బంధం’. ఈ చిత్రం ద్వారా విరాట్ కర్ణ అనే కొత్త కుర్రాడు హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఈ చిత్రం లో నభ నటేష్ నటించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే , 100 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఉన్న మూవీ ని ఎలా తెరకెక్కించారు?, నిజంగా డైరెక్టర్ అభిషేక్ నామా కి దండం పెట్టాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ మిస్టరీ గా ఉన్న నిధి ని ఛేదించడానికి అసురులు ప్రయత్నం చేస్తుంటారు. నిధి కంటే విలువైన బ్రహ్మ కమలం దొరికితే ఈ విశ్వాన్నే శాసించవచ్చు , అది కూడా అనంత పద్మనాభ ఆలయాళం లోనే ఉంటుంది. దాని కోసం అసురులు ప్రయత్నం చేయడం , హీరో దానిని అడ్డుకోవడమే ఈ సినిమా స్టోరీ.

ఇలాంటి ఫాంటసీ జానర్ సినిమాలకు ఇది రొటీన్ స్టోరీ నే , అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని చోట్ల VFX షాట్స్ తేడా కొట్టాయి, ముఖ్యంగా ట్రైలర్ లోని చివరి షాట్ లో , భారీ విష సర్పాలను చూపిస్తారు, అది చూసేందుకు సహజం గా లేదు. ట్రైలర్ మొత్తం మీద ఇదొక్కటే తేడా గా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో కూడా గొప్పగా అనిపించడం లేదు. చూసేందుకు బాగానే ఉన్నాడు కానీ , ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి విడుదలయ్యాక ఈ ఫీలింగ్ ఉంటుందో లేదో చూడాలి.

 

 

'వెల్కమ్ టు జడల్ జమానా'.. పూనకాలు రప్పిస్తున్న 'ది ప్యారడైజ్' లేటెస్ట్ టీజర్..

The Paradise Latest Teaser
The Paradise Latest Teaser

The Paradise Latest Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ గతం లో ఎప్పుడైనా చూశామా ?, నాని రైజ్ కి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి ఉంటుంది చెప్పండి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్ అయ్యింది. ముందుగా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ఆయా షేర్’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మేనియా నే కనిపిస్తోంది. జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు.

ఇకపోతే నేడు కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన విలన్ టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం రాఘవ్ జుయల్ అనే బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ పేరు విక్రమ్ మాలిక్. ‘ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా?, ఖాన్ దాన్ కా డాన్, స్నేహితులకు జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం , సుస్వాగతం’ అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో రాఘవ్ జుయల్ ని పరిచయం చేయించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మెడ మొత్తం నగలతో , స్టైల్ గా నడుచుకుంటూ రాగా, ఆ షాట్ కి అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. ఇక చివర్లో నేచురల్ స్టార్ నాని ‘వెల్కమ్ టు జడల్ జమానా’ అంటూ చెప్పే డైలాగ్ కూడా బాగా పేలింది. ఓవరాల్ గా హాలీవుడ్ తరహా మేకింగ్ స్టైల్ ని చూపించాడు డైరెక్టర్.

ఈ టీజర్ లో ప్రతీ షాట్ లోనూ క్వాలిటీ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. దీనిని బట్టీ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని , క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా , ఏ రేంజ్ లో తీస్తున్నాడా అర్థం అవుతోంది. అందుకే సినిమా విడుదలకు బాగా ఆలస్యం అవుతోంది. ఇక ఈరోజు విడుదల చేసిన ఈ టీజర్ ద్వారా అర్థమైన మరో విషయం ఏమిటంటే , ఈ చిత్రం ఆగస్టు 21 న కూడా విడుదల అవ్వడం లేదని. టీజర్ లో ఎక్కడ కూడా సినిమా విడుదల తేదీని ప్రస్తావించలేదు. నాని కూడా త్వరలో అన్నట్టుగానే చెప్పాడు కానీ , విడుదల తేదీ ప్రస్తావ తీసుకొని రాలేదు. కాబట్టి ఈ చిత్రం వాయిదా పడినట్టే అనుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

మహేష్ బాబు హీరోగా పనికిరాడని చెప్పిన దర్శకుడు ఎవరంటే..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu Hero Debut: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ముఖ్యంగా మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడు కృష్ణ చాలామంది దర్శకులను సంప్రదించారట. అందులో కొంతమంది దర్శకులు మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. మరికొందరైతే మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి పనికిరాడేమో అనేట్టుగా మాట్లాడారట. మొత్తానికైతే రాఘవేందర్రావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇంతకీ మహేష్ బాబును హీరోగా పనికిరాడు అని చెప్పిన డైరెక్టర్ ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి తమిళ్ సినిమా దర్శకుడు అయిన పి వాసు మహేష్ బాబును చూసి తను హీరోగా పెద్దగా పనికి వచ్చేలా కనిపించడం లేదు అని అన్నారట.

కానీ కసరత్తులు చేస్తే మాత్రం స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తను చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్న మహేష్ బాబు చాలా వరకు కసరత్తులు చేసి యాక్టింగ్ లో మెలుకువలను కూడా నేర్చుకొని స్టార్ హీరోగా మారాడు…

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఉండటం అనేది నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. నిజానికి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటిస్తాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తనలా నటించేవారు ఇండస్ట్రీలో మరెవరు లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోతాడు…ఇక ఈ మూవీ తర్వాత ఆయన డైరెక్ట్ గా హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమా చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…