Today 20 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అన్ని విజయాలే సమకూరుతాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగుపడతారు. పెండింగ్ బకాయిలను తిరిగి చెల్లిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా మారుతారు. ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి మార్గం ఏర్పడుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ఆలోచన ఉంటే మానుకోవడం మంచిది. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి కొన్ని మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఒత్తిడికి లోను కాకుండా పనులను పూర్తి చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో మాట తీరుపై కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఆధారంగా బాధ్యతలు ఏర్పడతాయి. ఇదే సమయంలో కొత్త ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త బాధ్యతలను చేపడతారు. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. కొందరు తమ పనితీరు తో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అవసరమైన వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వీరి ఆలోచన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా పనిని ప్రారంభించే వారు ప్రజలను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనుల కారణంగా బిజీగా మారిపోతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరి వ్యక్తుల కదలిక వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉండడంతో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారంలో నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇది సరైన సమయం కాదు.
















పవన్ కళ్యాణ్ కాదట కమల కళ్యాణ్ అట.. పీసీసీ చీఫ్ మహేష్ కు ఎందుకింత ఆగ్రహం..
Mahesh Kumar Goud: పవన్ కళ్యాణ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఆగడం లేదు. తమ స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. మందుల సామ్యూల్.. అనిరుద్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెడితే చాలు వీరికి విపరీతమైన కోపం వస్తోంది. సమయం, దొరికినప్పుడల్లా సందర్భం లేకుండానే తిట్టేస్తున్నారు. పైగా ఆ తిట్టే విధానంలో కూడా పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు.
తెలంగాణలో పార్టీ కార్యాలయం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇది జరగగానే వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి వచ్చారు. ఈసారి విమర్శల దాడిని మరింత పెంచారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ పేరు కమల కళ్యాణ్ అంటూ ఆరోపించారు. కమల కళ్యాణ్ తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని.. తెలంగాణకు వచ్చి ఏదో సాధిస్తానని అనుకోవడం పగటి కల అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బిజెపికి అనేక రెక్కలు ఉన్నాయని.. అందులో పవన్ కళ్యాణ్ ఒకడు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే భోజనం పెడతానని.. ఇక్కడ రాజకీయాలు చేస్తానంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను పట్టించుకోవడంలేదని.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా సీరియస్ గా స్పందిస్తారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయబోనని.. ఇంతకుముందే చెప్పారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ స్థాయిలో ఎందుకు స్పందిస్తున్నారు.. తెలంగాణలో తెలంగాణ బిడ్డలు మాత్రమే రాజకీయాలు చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంత ఆవేశపడుతున్నారు.. కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎందుకంత పొలిటికల్ స్పేస్ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటున్నారు.. తనకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదని.. తెలంగాణలో ఏం అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎందుకు బూచిగా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మహేష్ కుమార్ గౌడ్ కు మనుగడ ఉంటుందా.. ఇదే మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీ ఒక సిరీస్ స్టోరీలను పబ్లిష్ చేసింది. ఆ చానల్ కూడా అధికార పార్టీ నాయకుడిది. ఆ ఛానల్ మీద ఇంతవరకు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఆ ఛానల్ అపాలజీ కూడా చెప్పలేదు. అలాంటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తనను తాను ఎందుకు అంత గొప్పగా ఊహించుకుంటున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని.. పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన పార్టీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి మాత్రమే బాధ్యతలు అప్పగించారని.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారని జనసేన నాయకులు అంటున్నారు.. ఈ విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ మర్చిపోవడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.