Homeటాప్ స్టోరీస్8.74 Crore Ship Sinks In Sea: 8.74 కోట్ల నౌక.. చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయింది.....

8.74 Crore Ship Sinks In Sea: 8.74 కోట్ల నౌక.. చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయింది.. వైరల్ వీడియో

8.74 Crore Ship Sinks In Sea: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 కోట్లకు పైగా నగదుతో ఆ ఓడను నిర్మించారు. అత్యంత అధునాతనమైన సౌకర్యాలు అందులో కల్పించారు. తినే తిండి దగ్గరనుంచి తాగే మద్యం వరకు ప్రతి విషయంలోనూ లగ్జరీని కొనసాగించారు. ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నారు. అని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సముద్రంలో విహరించడానికి ఒక రోజును నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ ఓడను సముద్రంలో వదిలారు. కొద్దిసేపు అలా ప్రయాణించగానే అందులో ఉన్న యాత్రికుల్లో విపరీతమైన ఆనందం.. సముద్ర యానం చేస్తున్నామని ఉత్సాహం.. ఆ ఆనందం.. ఆ ఉత్సాహం క్షణంలోనే మాయమయ్యాయి.

సముద్రంలో ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే ఖరీదైన ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ఉత్తర తుర్కియే ప్రాంతంలోని జొంగుల్డాక్ సముద్ర తీరంలో జరిగింది. ఓడ మునిగిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనం కలిగిస్తున్నాయి.. ఈ సముద్రంలోని మెడ్ ఇల్మాజ్ షిప్ యార్డ్ లో ఈ ఓడను వదిలారు. కొంతమంది ప్రయాణికులు.. నౌకా సిబ్బందితో కలిసి ఓడ ప్రయాణం మొదలుపెట్టింది. సముద్రంలోకి వెళ్ళిన 15 నిమిషాల్లోనే అందులో మునిగిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత ఈదుకుంటూ ఓటుకు చేరుకున్నారు. సముద్రంలో ఓడ మునిగిపోతున్న క్రమంలో దాని యజమాని నిర్వేదంలో మునిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూ విచలితుడిగా మారిపోయాడు.

ఓడ కెప్టెన్ కూడా ఏం చేయాలో తెలియక సముద్రంలో దూకాడు. అతడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు.. అందరూ సురక్షితంగానే ఉన్నారని.. నౌక ఎందుకు మునిగిపోయిందనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని కెప్టెన్ చెప్పారు. ఈ వ్యవహారంపై త్వరలోనే విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు..” ఈ ఓడ ఎందుకు మునిగిపోయిందనే విషయంపై స్పష్టత కొద్దిరోజుల్లో వస్తుంది. చూస్తుండగానే మునిగిపోవడం ఇబ్బంది కలిగించింది. ఓడ మునిగిపోయినప్పటికీ ప్రయాణికులు సురక్షితంగానే ఒడ్డుకు వచ్చారు. ఇది మాత్రమే కాస్త సంతోషకరమైన విషయం. అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఓడను తయారు చేస్తే చివరికి ఇలా అయ్యిందంటూ” కెప్టెన్ వాపోయాడు. కొంతమంది ఈ ఓడ మునిగిపోతున్న దృశ్యాన్ని చూసి టైటానిక్ సంఘటన గుర్తుకొచ్చిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular