Homeఅంతర్జాతీయంUK Visa Rules 2024: వీసా నిబంధనలపై వెనక్కి తగ్గిన యూకే.. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత...

UK Visa Rules 2024: వీసా నిబంధనలపై వెనక్కి తగ్గిన యూకే.. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులకు ఊరట!

UK Visa Rules 2024: అమెరికాలోని భారతీయ టెకీలకు ఇది శుభవార్త. హెచ్‌–1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయడానికి అపీలేట్‌ఓర్టు అనుమతి ఇచ్చింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ కోసం అమెరికా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌పై ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జన్మించిన టెక్‌ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూప్‌ అయిన సేవ్‌ జాబ్స్‌ నుండి వచ్చిన సవాల్‌ను కోర్టు తోసిపుచ్చింది. తాజాగా బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట కలిగించే విషయం చెప్పింది ప్రభుత్వం. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో వార్షికాదాయం 38 వేల పౌండ్లు (రూ.41.5 లక్షలు) ఉండనవసరం లేదు. లేబర్‌ పార్టీ నిర్ణయం అక్కడ నివసిస్తోన్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించనుంది.

ఆదాయ పరిమితి పెంపు..
బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు పటుంబ ఆదాయ పరిమితిని రిషి సునక్‌ సర్కార్‌ పెంచింది. 29 వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచాలని నిర్ణయించింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు తెలిపింది. ఈమేరకు బ్రిటన్‌ హోంశాఖ మంత్రి యెవెట్‌ కూపర్‌ ఇటీవల ప్రకటించారు. 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించాలని నిర్ణయించామన్నారు. అంతవరకు ప్రస్తుతం ఉన్న కుటుంబ ఆదాయ పరిమితి 29 వేల పౌండ్లుగానే ఉండనుందని చెప్పారు. వలసలకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని కూపర్‌ తెలిపారు. విదేశీయులను నియమించుకునే ముందు, స్థానిక శ్రామిక శక్తికి నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.

వార్షిక ఆదాయం ఇలా..
ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే. వారి కనీస వార్షిక ఆదాయం 29 వేల జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. దాన్ని ఇటీవలే 55 శాతం మేర పెంచారు. 2025 నుంచి దీనిని 38,700 పౌండ్లకు పెంచాలని రిషి సునాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇదీ ఒకటి. అయితే, బ్రిటన్‌ ఇచ్చే కుటుంబ వీసా కేటగిరీల్లో భారతీయులు కూడా భారీ సంఖ్యలో లబ్దిపొందుతుంటారు. 2023లో 5,248 మంది వీసా పొందారు. తాజాగా కీర్‌ స్టార్మర్‌ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భారతీయులతో సహా విదేశీయులకు ఉపశమనం లభించనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper