గోడకూలి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జోధ్ పూర్ లోని బస్ని పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 40 వేల చొప్పున ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు.