ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఓ జవాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా వెలుగుచూసింది. పంజాబ్ జిల్ల సంగ్రూర్ జిల్లాకు చెందిన రాయ్పాల్ సింగ్ అనే జవాను డిఫెన్స్ సెక్యూరిటీకి చెందిన నావికా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. తన సర్వీసు రైఫిల్తో రెండు రౌండ్లు కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దం విన్న నావికాదళం సిబ్బంది అతడిని అంబులెన్స్లో రాజవాడి సివిల్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. రాయ్పాల్ సింగ్ తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని దీనికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.