దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 895 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,12,161కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,06,528 యాక్టివ్ కేసులు ఉండగా.. 64,53,780 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. నిన్నటి కేసులతో పోలిస్తే ఈరోజు కేసులు తగ్గినా మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది.