
కోర్టుకు హాజరు నుంచి తప్పించుకునేందుకు నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ సమర్పించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మెన్దావాల్ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాగెల్కు వ్యతిరేకంగా 2010లో నమోదైన హత్యాయత్నం, ప్రజా ఆస్తికి నష్టం కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు తనకు కరోనా పాజిటివ్ అని నకిలీ సర్టిఫికెట్ను ఆయన సృష్టించారు. సంత్ కబీర్ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్గోవింద్ సింగ్ దానిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు తెలిపారు