
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 44,878 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 547 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,28,795గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,28,688కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,84,547 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 81,15,5801 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 92.97శాతంగా ఉంది.