
దేశంలో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 512 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,36,012గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,27,571కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,94,657యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 80,36,012 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా మరణాల రేటు 1.48 శాతంగా ఉంది. రికవరీ రేటు 92.69 శాతంగా ఉంది.