Homeఅత్యంత ప్రజాదరణకేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఏ1గా ఏపీ నేత?

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఏ1గా ఏపీ నేత?

Kidnap case

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఊహించన ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే ఈ ఉదయం ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం ఈ కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తాజాగా సంచలన విషయం బయటపెట్టారు.

Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని

అందరూ అనుకుంటున్నట్టు ఈ కేసులో ఏ1గా ప్రధాన సూత్రధారి అఖిల ప్రియ కాదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. కొత్తగా తెరమీదకు ఏవీ సుబ్బారెడ్డి పేరు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు.

మొత్తం ఈ కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ప్రధాన పాత్రధారి అని.. ఆ తర్వాత అఖిలప్రియ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.ఈ మేరకు బాధితుల వాంగ్మూలం ప్రకారం ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి,ఏ2గా భూమా అఖిలప్రియను చేర్చినట్టు తెలిపారు.

Also Read: ట్విట్టర్ ద్వారానే పవన్ ‘రామతీర్థం’ నిరసన?

నిజానికి గత కొన్నేళ్లుగా భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రమైన విభేదాలు , ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హఫీజ్ పేట్ భూవ్యవహారమంతా తనకు తెలుసు అని.. ఈ దశలో తాను మాట్లాడనని ఏవీ సుబ్బారెడ్డి అన్నట్టు సమాచారం. అఖిలప్రియ, భార్గవ్ రామ్ పాత్రపై అన్ని వివరాలు తనకు తెలుసు అని సుబ్బారెడ్డి తెలిపినట్టు సమాచారం. ఆధారాలతో బయటపెడుతానని చెప్పినట్టు తెలిసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular