Homeబిజినెస్Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సులువుగా రెట్టింపు డబ్బులు పొందే అవకాశం?

Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సులువుగా రెట్టింపు డబ్బులు పొందే అవకాశం?

Post Office Scheme: ప్రస్తుతం ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా ఆ డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సేవింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పది సంవత్సరాల తర్వాత రెట్టింపు అవుతాయి. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందనే సంగతి తెలిసిందే.

అందువల్ల ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.9 శాతం వడ్డీని అందిస్తుండటం గమనార్హం. 2020 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీని అందిస్తోంది. కనీసం 1,000 రూపాయలతో పోస్టాఫీస్ లో ఈ స్కీమ్ కు సంబంధించిన ఖాతాను తెరవవచ్చు.

గరిష్ట పరిమితి లేకపోవడంతో ఈ స్కీమ్ లో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పది సంవత్సరాల వయస్సు ఉన్న మైనర్లు సైతం ఈ స్కీమ్ లో ఖాతా తెరిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ముగ్గురు సభ్యుల వరకు జాయింట్ అకౌంట్ తెరిచే అవకాశం అయితే ఉంటుంది.

కొన్ని సందర్బాల్లో మాత్రమే ఈ అకౌంట్ మరో వ్యక్తికి బదిలీ చేయబడుతుంది. ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఖాతాదారుడు మరణిస్తే జాయింట్ హోల్డర్ కు ఖాతాను బదిలీ చేయవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ఖాతాను బదిలీ చేయడంతో పాటు ఖాతాను తనిఖీ పెట్టవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular