Homeలైఫ్ స్టైల్Chanakya Niti: మగవారి కంటే ఆడవారికి తెలివితేటలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో తెలుసా?

Chanakya Niti: మగవారి కంటే ఆడవారికి తెలివితేటలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో తెలుసా?

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాలు చెప్పాడు. వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, స్త్రీలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించాడు. ఈ విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందుంటారని చెప్పాడు. మగవారి కంటే మహిళలే అన్నింట్లో ముందుంటారు. పనుల్లో కూడా వారే చురుకుగా చేస్తారు. దీంతో అన్ని రంగాల్లో కూడా వారే అధికంగా ఉంటారు. మగవారు దేన్ని పట్టించుకోరు. చాణక్యుడి సూచించిన ప్రకారం ఆడవారి తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయి.

చురుకుదనం

మగవారి కంటే ఆడవారే చురుకుగా ఉంటారు. పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారిగా చెబుతారు. ప్రత్యేక సందర్బాల్లో వారి తెలివితేటలు బయటపడతాయి. పురుషుల కంటే మెరుగ్గా ఆలోచిస్తారు. సవాళ్లకు భయపడకుండా కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది. కుటుంబంలోని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయట పడేస్తుంది. ఇలా మగవారి కంటే ఆడవారికే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

ఆకలి

పురుషుల కంటే స్త్రీలకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. మగవారి కంటే ఆడవారు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. మహిళలకు ఆకలి ఎక్కువగా ఉండటం వల్లే అలా తింటారు. మహిళల శరీర నిర్మానం కోసం ఎక్కువ కేలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మగవారి కంటే ఆడవారు ఎక్కువగా తింటేనే సాధ్యం అవుతుంది. ఇలా స్త్రీలు ఎక్కువ ఆహారం తీసుకోవడం కామనే.

ధైర్యం

మగవారి కంటే ఆడవారికే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలకు 6 రెట్లు ధైర్యం అధికంగా ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం ఆడవారిని శక్తి స్వరూపంగా చెబుతారు. ఒత్తిడిని తట్టుకోవడంలో మహిళలే ముందుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అమలు చేస్తారు. ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది.

శ్రద్ధ

మహిళలు మృదువైన స్వభావం కలిగి ఉంటారు. కుటుంబాన్ని ఎంతో శ్రద్ధతో నడిపిస్తారు. భర్తను సుఖ పెట్టడంతో మహిళ పాత్రే ముఖ్యం. అవసరమైతే కుటుంబం కోసం సర్వం త్యాగం చేస్తుంది. తన వారి కోసం నిరంతరం శ్రమిస్తుంది. కుటుంబం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సమస్యలు తీర్చడంలో కూడా మహిళలు ఉత్సాహంగా ఉంటారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular