బీజెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హెల్దేర్ అన్నారు. గుంటూరులో రమ్య కుటుంబాన్ని ముగ్గురు సభ్యులు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పరామర్శించింది. ఘటనకు దారి తీసిన పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై బృందం ఆరా తీసింది. సుమారు 20 నిమిషాల పాటు రమ్య ఇంటి వద్దే ఉంది వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అరుణ్ హెల్దేర్ మీడియాతో మాట్లాడుతూ రమ్య హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.