
భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఈ టెస్టులో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ ను భయపెడుతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 53/3 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ అదే స్కోరు వద్ద క్రెయింగ్ ఒవర్టన్ (1) ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన డేవిడ్ మలాన్ (31) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ కోల్పోయిన 5 వికెట్లలో మూడు ఉమేశ్ కు దక్కగా, రెండు బుమ్రా ఖాతాలోకి చేరాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 78 పరుగులతో ఉంది.