
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్ ను బహిష్కరించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు గానూ చైనా ఒలింపిక్స్ ను దౌత్యపరంగా వెలివేయాలని అన్నారు. ఆ ఒలింపిక్స్ కు ప్రపంచ నేతలు ఎవరూ హాజరు కావద్దని కూడా పెలోసి అన్నారు. అయినా వారు వెళితే నైతిక బలాన్ని కోల్పోయినట్లు అవుతుందని అన్నారు. చైనా ఒలింపిక్స్ ను బహిష్కరించడమో లేక ఒలింపిక్స్ ను అక్కడి నుంచి వేరేచోటికి మార్చడమో చేయాలని అమెరికా చట్టసభల ప్రతినిధులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.