కెప్టెన్సీ తనకు కొత్త సవాలని శ్రీలంకతో సిరీస్ కు సన్నద్ధమవుతున్న సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ అన్నాడు. శ్రీలంకు బయల్దేరే ముందు నిర్వహించిన వర్చువల్ విలేఖరుల సమావేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో కలిసి ధావన్ మాట్లాడాడు. రెండు వారాల క్వారంటైన్ వల్ల ఆటగాళ్లలో సాన్నిహిత్యం పెరిగిందని, అది మైదాన్యంలో ప్రదర్శనలో ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు.