
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్ పర్సన్ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి ఆశోక్ గజపతిరాజును మాన్సాన్ ట్రాస్ట్ ఛైర్మన్ గా పునర్నియమించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సంచయిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.