thamilisai
రాజ్ భవన్ మహిళల కోసం గవర్నర్ తమిళిసై సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. రాజభవన్ మహిళల స్వయం ఉపాధి కోసం వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కుట్లు, జ్యూట్ బ్యాగ్లు , అల్లికలు, ఎంబ్రాయిడరీ, తయారీ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకే గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ మహిళల కోసం ఆరోగ్యం కోసం యోగ లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.