
తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పాదయాత్ర చేస్తామని ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తీన్మార్ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఘట్ కేసర్ మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో తన అభిమానులతో మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. పాదయాత్రకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆహ్వానిస్తామని తెలిపారు.