అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం పనిచేయనుందని సీనియ్ తాలిబన్ నాయకుడు తాజాగా ప్రకటించారు. అఫ్గానిస్తాన్ ను ఎలా నడిపిస్తారనే అంశంపై ఇంకా అనేక అంశాలు ఖరారు కాలేదని, గ్రూప్ నాయకత్వం త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా చెప్పారు.