మావోయిస్టు నేత జజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట శారదక్క లొంగుబాటును ప్రకటించింది. శారదక్క.. కరోనాతో మృతిచెందిన మావోయిస్టు నేత హరిభూషణ్ భార్య. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో శారదక్క బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం.