ప్రజా సంగ్రామ యాత్ర నేడు చేవెళ్ల మోడల్ కాలనీ నుంచి ప్రారంభం కానుంది. ఆరవ రోజు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇబ్రహీంపల్లి, దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ గేట్,ఆలూరు గేట్ మీదుగా చిట్టంపల్లి గేట్ కు పాదయాత్ర చేరుకోనుంది. ఆరవ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 8 కిలోమీటర్లు నడవనున్నారు.