
ఏపీలో ఐదుగురు ఐఏఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది, నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినా చెల్లింపుల్లో జాప్యం జరగడంతో ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు, రూ. 100 జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రూ. 1000 జరిమానా, 2 వారాల జైలు శిక్ష, ఎన్.ఎస్ రావత్ కు నెల రోజు జైలు, రూ. 1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ. 1000 జరిమానా విధించింది.