
బ్యాటింగ్ కు సహకరిస్తున్న నిర్జీవమైన పిచ్ పై అశ్విన్ గైర్హాజరీలో ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడం కష్టమే అన్న విశ్లేషకుల అభిప్రాయాలను పటాపంచలు చూస్తూ.. భారత బౌలర్లు విజృంభించిన వేళ.. ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా మరో అద్భుత విజయాన్నందుకుంది. యార్కర్ కింగ్ జస్ర్పీత్ బుమ్రా పాతబంతితో రివర్స్ స్వింగ్ రాబడితే.. రవీంద్ర జడేజా తన ఎక్సె ప్రెస్ స్పిన్ తో ప్రత్యర్థి పనిపట్టాడు. బ్యాటింగ్ లో భళా అనిపించుకున్న శార్దూల్ ఠాకూర్ కీలక సమయాల్లో ట్రేక్ త్రూలు ఇప్పిస్తే.. రెండో ఇన్నింగ్స్ లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఉమేశ్ యాదవ్ తన అనుభవాన్ని చాటుకున్నాడు. సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కోహ్లీ సేన చివరి మ్యాచ్ ను డ్రా చేసుకున్నా.. ట్రోఫీ చేజిక్కడం ఖాయం.