
హైదరాబాద్ లో వచ్చే వారంలో ఎంఎంటీఎస్ రైలు సేవలు పున ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అవస్థలు పడుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయన్నారు.