కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. మద్యం ఆదాయం పై అప్పు చేయడంపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు, తద్వారా అప్పులు చేయడం.. రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసంది. బుగ్గన వెంట వైసీపీ ఎంపీలు, ఎపీ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, ఆర్థికశాఖ అధికారులు ఉన్నారు.