HomeతెలంగాణHyderabad Restaurants : హైదరాబాద్ లో బిర్యానీ తింటున్నారా.. ఈ వీడియో పై ఓ లుక్కేయండి

Hyderabad Restaurants : హైదరాబాద్ లో బిర్యానీ తింటున్నారా.. ఈ వీడియో పై ఓ లుక్కేయండి

Hyderabad Restaurants : హైదరాబాద్ నగర వాసులకే కాదు, తెలంగాణ ప్రజలకు బిర్యానీతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.. రకరకాల బిర్యానీ ఫ్లేవర్లను హైదరాబాద్ వాసులు ఇష్టపడుతుంటారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా బిర్యాని కడుపునిండా లాగించేస్తుంటారు. హైదరాబాదులో బిర్యానీకి ఫేమస్ హోటళ్లు చాలా ఉన్నాయి. అందులో బావర్చి, షా గౌస్, ప్యారడైజ్, మెహెఫిల్ హోటళ్లు ప్రముఖమైనవి. గతంలో హైదరాబాద్ నగరంలో బిర్యాని తయారుచేసే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు తినే వాళ్ళు పెరిగిపోవడంతో హోటళ్లు […]

Hyderabad Restaurants : హైదరాబాద్ నగర వాసులకే కాదు, తెలంగాణ ప్రజలకు బిర్యానీతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.. రకరకాల బిర్యానీ ఫ్లేవర్లను హైదరాబాద్ వాసులు ఇష్టపడుతుంటారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా బిర్యాని కడుపునిండా లాగించేస్తుంటారు. హైదరాబాదులో బిర్యానీకి ఫేమస్ హోటళ్లు చాలా ఉన్నాయి. అందులో బావర్చి, షా గౌస్, ప్యారడైజ్, మెహెఫిల్ హోటళ్లు ప్రముఖమైనవి.

గతంలో హైదరాబాద్ నగరంలో బిర్యాని తయారుచేసే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు తినే వాళ్ళు పెరిగిపోవడంతో హోటళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వ్యాపారం కూడా లక్షల నుంచి కోట్లకు చేరుకుంది. దీంతో అనేక సంస్థలు హోటల్ ఫీల్డ్ లోకి వచ్చేసాయి. బిర్యానీతోపాటు.. రకరకాల వంటకాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. తయారు చేసే విధానం సక్రమంగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, అపరిశుభ్రమైన వాతావరణంలో వీటిని తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర పరిధిలో హోటళ్ల లో అధికారులు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఈ తనిఖీలలో దారుణమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు తయారు చేయడం.. గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించడం.. బూజు పట్టిన కూరగాయలు వాడటం.. ఫ్రిజ్ లో చాలా రోజులపాటు మాంసం నిల్వ ఉంచడం.. వంటివి వెలుగులోకి వచ్చాయి.. ఇటువంటి వంటకాలవల్ల తినేవాళ్ళకు లేనిపోని రోగాలు వస్తాయి.

హైదరాబాద్ నగరంలో ఇటీవల అధికారులు మెహెఫిల్ రెస్టారెంట్ మీద దాడులు చేశారు. ఈ క్రమంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మురికిగా ఉన్న ఫ్లోర్ మీద చికెన్ గ్రిల్ చేసి.. పెట్టడం.. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న ప్రదేశంలో రుమాలీ రోటీలు చేయడం.. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వంటకాల తయారీలో ఉపయోగించడం.. వంటివి వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి మెహెఫిల్ రెస్టారెంట్లో ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. బిర్యాని తయారీ కూడా అత్యంత దుర్గంధమైన వాతావరణంలో చేయడం అధికారుల తనిఖీలలో బయటపడింది. ఇటీవల కాలంలో హైదరాబాదులో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలలో ఇటువంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అందువల్లే ఇటువంటి హోటల్స్ లో తినకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper