కేంద్ర మంత్రి పదవులకు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ రాజీనామా చేశారు. వారి రాజకీయ భవితవ్యంపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు గవర్నర్ గా పంపించనున్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దర్నీ పార్టీ సేవలకు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. వీరిద్దరిలో ఒకరిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మరొకర్ని జాతీయ ఉపాధ్యక్షునిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.