సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా ఎంపీ, ఎమ్మెల్యే లకు సంబంధించిన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని , ఎంపీ, ఎమ్మెల్యే కేసులను విచారిస్తున్న ఏసిబి, సిబిఐ, ప్రత్యేక కోర్టులకు తెలంగాణ హై కోర్ట్ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్బంగా తెలంగాణలోని కోర్టులు అనుసరించాల్సిన ఆన్ లాక్ నిబంధనలను హై కోర్ట్ ప్రకటించింది. విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగిచాలని, జిల్లా కోర్ట్ లలో భౌతిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది.