
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్ టికెట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్ లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కౌశిక్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.