
అసోం 15వ ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జగదీశ్ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.