
సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రవిగుప్తాపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టారాదో తెలపాలని వివరణ కోరింది. 177 మంది ఏపీపీల నియామకంపై ఏప్రిల్ 1న ఏజీ హైకోర్టుకు తెలిపారు. రెండున్నర నెలలైనా నియమించకపోవడం ఆమోదయోగ్యం కాదు. హోంశాఖ గాఢ నిద్రలో ఉందా అని హైకోర్టు వ్యాక్యనించింది. ఏపీపీల నియామకంపై విచారణను జూలై 7కి వాయిదా వేసింది.