
పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 62వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రస్తుతం మూడూ గేట్లు ఎత్తి 52,393 క్యూసెక్యుల నీటిని కిందికి వదులుతున్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల జలాశయం పూర్తిసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్టా నదిలోకి నీరు విడుదల చేస్తున్నందున పరీహవాక ప్రాంత గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.