
దివంగత కేంద్ర మాజీ మంత్రి పి. ఆర్. కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దిల్లీ వసంత్ విహార్ లోని ఆమె నివాసంలో ఈ దారుణం జరిగింది. కిట్టీ కుమారమంగళం ఆమె నివాసంలో మరో సహాయకురాలితో కలిసి నివాసముంటున్నారు. తరచూ బట్టలు ఉతకడానికి వచ్చు ఓ వ్యక్తి మంగళవారం రాత్రి తలుపు కొట్టాడు. తెలిసినవాడు కావడంతో ఇంట్లోని సహాయకురాలు లోపలికి అనుమతించింది. ఆ దుండగుడు వెంటనే ఆమెను ఓ గదిలో తాడుతో కట్టి బందించాడు. ఆ వెంటనే మరో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి కిట్టీ కుమారమంగళాన్ని దిండుతో ముఖంపై అదిమి హతమార్చారు.