
విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ కలకలం రేపింది. తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు అయింది. గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన ఒక యువతికి డెల్టా సోకినట్లు నిర్ధారణ అయింది. మే నెలలో వారం రోజుల తేడాతో రెండు సార్లు కరోనా సోకింది. అనుమానంతో మే నెలలోనే పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కి వైద్యులు పంపారు. ల్యాబ్ మూడు వారాల తరువాత డెల్టాగా నిర్ధారిస్తూ రిపోర్టు పంపారు. ప్రస్తుతానికి డెల్టా నుంచి కోలుకొని యువతి సురక్షితంగా బయటపడ్డారు.