
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా 1,540 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రశాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు.