
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో ఓ బాధితుడు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు చేశాడు. ఈటల రాజేందర్ కొడుకు నితిన్ తన భూమిని కబ్జా చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేడ్చల్ మండలం రావల్ కోల్ కు చెందిన మహేష్ తనకు న్యాయం చేయాలంటూ సీఎంను కోరాడు. బాధితుడి మహేష్ ఫిర్యాదు పై స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే దర్యప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ఏసీబీ, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.