
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. వేమూరి కనకదుర్గ మృతిపట్ల సీఎం జగన్ తీవ్ర సంతాపం తెలిపారు. రాధాకృష్ణను సీఎం జగన్ ఫోన్ లో పరామర్శించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు.