దేశంలోని హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొలీజియం సిఫార్సులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీజేఐ లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో సంబంధమున్న వారిని కరోనా యోధులుగా గుర్తించాలని కోరారు. కోర్టు సిబ్బంది కుటుంబ సభ్యులకు టీకా ఇవ్వాలని కరోనాతో ఉపాధి కోల్పోయిన జూనియర్ లాయర్లకు సాయం అందించాలన్నారు.