
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ 450 ఆక్సిజన్ కాన్సట్రేటర్లను ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది భారీ సాయంగానే చెప్పుకోవాలి. సిఎస్ కే డైరెక్టర్ ఆర్ శ్రీనివాసన్ ఆక్సిజన్ కాన్సట్రేటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు అందజేశారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రూపా గురునాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న భూమిక ట్రస్ట్ అనే ఎన్టీఓతో ఒప్పందం కుదుర్చుకుంది.