ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చక మోసం చేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ చేస్తానని ప్రకటించడం ద్వారా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటన లక్షల్లో ఉండి భర్తీ మాత్రం నామమాత్రంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు.
Posted by Somu Veerraju on Monday, 21 June 2021