
టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ యువతికి టోకరా వేశారు. బషీరాబాగ్ కు చెందిన యువతి ఇటీవల నౌకరీ డాట్ కామ్ లో బయోడేటా అప్ లోడ్ చేశారు. దీని ఆధారంగా కేటుగాళ్లు యువతికి ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేరిట రూ. లక్షకు పైగా వసూలు చేశారు. అనంతరం మోసపోయానని గుర్తించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.