
జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూటెక్ జోన్ జోన్ ఛార్జిషీట్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ ఛార్జి షీట్ నుంచి తన పేరు తొలగించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అనవసరంగా ఈకేసులో తనను ఇరికించిందని కోర్టుకు తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారధిరావు డిశ్చార్జి పిటిషన్ దాఖలుకు సమయం కోరారు. డిశ్చార్జి పిటిషన్ వేసే ఉద్దేశం లేదని ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందూటెక్ జోన్ ఛార్జి షీట్ పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఎమ్మార్ విల్లాల విక్రయంపై సీబీఐ, ఈడీ విచారణ ఈనెల 28 కి వాయిదా పడింది.