
తెలంగాణలోని యాదాద్రి భూవనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉండగానే అకస్మాత్తుగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళ్తున్న బస్సుకు ఫిట్ నెస్ తేకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపారు. అనంతరం వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.