
తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో గతంల మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం లాక్ డౌన్ ను ఈ నెల 10తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. మేలో లాక్ డౌన్ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది.