
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు కలిపి గేట్లు పైకి ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనరగ్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.