గాంధీ దవాఖానలో మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ ల్యాబోరేటరీ ముందుకు వచ్చింది. కంపెనీ మేనేంజిగ్ డైరెక్టర్ డాక్టర్ మురళి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా గంటకు 22 వేల లీటర్లు సామర్థ్యంతో లిక్విడ్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రూ. 80 లక్షల నిధులను కేటాయించారు. దీనిని గాంధీ మెడికల్ కళాశాల నూతన లైబ్రరీ భవనం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు.