
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. వాదనల సమర్పణకు 10 రోజుల గడువు కోరింది. సీబీఐ వైఖరిపై రఘురామ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ తరచూ వైఖరి మారస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అనంతరం పిటిషన్ పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది.